23, జూన్ 2017, శుక్రవారం
17, జూన్ 2017, శనివారం
యాత్ర ---షట్ సుబ్రహ్మణ్య సహిత ద్వాదశ జ్యోతిర్లింగ,శక్తిపీఠదర్శనములు
యాత్ర
21-5-12 నుండి 24-6-12 వరకు
ఈ యాత్ర కొంతమంది దాతల ప్రోత్సాహముతో,యనమండ్ర మల్లేశ్వరశాస్త్రి గారి ఆధ్వర్యమున రాష్ట్రీయ సువిధ సేవాసమితి ద్వారా చేయబడింది.శ్రీ వి.శ్యావాశ్వమహర్షి,శ్రీ సి.హెచ్.రత్నాకర శర్మ,శ్రీకే.రామకృష్ణశర్మ,పి.గణపతిశర్మ,శ్రీఎస్.భావనారాయణశర్మ,వై.ఫణికాంత శర్మ,ఉమాకాంతశర్మ,వై.శ్రీకాంత్ శ ర్మ,శ్రీఎల్.మురళీ మోహనశర్మ,శ్రీఎం.సుబ్రహ్మణ్యశర్మ ,శ్రీ సి.హెచ్.శ్రీనివాసశర్మ,శ్రీ టి.కిశోర్ శర్మ,శ్రీ కె.ఆదిత్య శర్మ,శ్రీ సి.హెచ్.శ్రీకర్ శర్మ,శ్రీ వి.భరద్వాజ శర్మ,శ్రీ కె.ఉదయ్ శర్మ,ఈ ఋత్విక్కులు పాల్గొనిరి.వీరు అభిషేకార్చనలలో అన్ని యాత్రా ప్రదేశాలలో పాల్గొని యాత్రను విజయవంతము చేసిరి.
యాత్రికులు,దాతల పేర్లు దిగువన ఇవ్వబడినవి..
1.శ్రీ సి.హెచ్.సుబ్రహ్మణ్య శర్మ2.శ్రీమతి సి.హెచ్.అన్నపూర్ణ ౩.శ్రీ ఎస్.భాస్కర్ 4.శ్రీమతి ఎస్.విజయ 5.శ్రీ ఎస్.రవికుమార్6.శ్రీమతి ఎస్.కన్యాకుమారి 7.శ్రీమతి ఆర్.విజయలక్ష్మి 8.శ్రీమతి జి.జయప్రద 9.శ్రీ టి.త్యాగారాజశర్మ 10.శ్రీమతి టి.అరుణ 11.శ్రీ జి.లక్ష్మీ నారాయణ శర్మ 12.శ్రీమతి జి.రాధ 13.శ్రీ టి.వి.ప్రసాదరావు 14.శ్రీమతి టి.అన్నపూర్ణ 15శ్రీమతి ఆర్.సీతామహాలక్ష్మి 16.శ్రీ కే.శివ శంకరరావు 17.శ్రీమతికె.సత్యవతి 18.శ్రీమతి ఎం.సూర్యమణి 19.శ్రీమతి.వై .వి.మహాలక్ష్మి 20.శ్రీమతి వై.సువర్చల 21.శ్రీమతి ఎస్.బాలామనోజ్ణ 22.చి||ఎస్.విద్యాచరణ్ 23.శ్రీమతికె.శ్రీదేవి 24.శ్రీమతి వి.రాజేశ్వరి 25.శ్రీమతి వై.నీహారిక 26.శ్రీమతి వై.సత్య27.కుమారి వై.మృణాళిని28.కుమారి కె.కిరణ్మయి 29.కుమారి ఎస్.శ్రీకరి 30.చి||కె.గణపతిశర్మ 31.శ్రీమతిటి.సత్యవాణి 32.శ్రీమతి సిహెచ్.లలితమ్మ 33.శ్రీ ఏం.సోమేశ్వరరావు 34.శ్రీ డి.మురళి 35.శ్రీమతి.ఎం.నాగమణి 36.శ్రీమతి బి.నాగకుమారి 37.శ్రీమతి వి.హరీప్రియ 38.శ్రీమతి సి.హెచ్.జయలక్ష్మి 39.శ్రీ సిహెచ్.త్రినాధకుమార్ 40.శ్రీమతి సిహెచ్.జ్యోత్స్న
వైదికసహాయకులు -శ్రీ ఎం.కె.ప్రసాద శర్మ,శ్రీ కె.సూర్యప్రకాష్
అల్లరి పిడుగులు -మైత్రేయీ,ఈశ,ఐతరేయమహర్షి
పాకశాస్త్ర ప్రవీణులు-శ్రీ యు.వెంకటరమణ ,శ్రీ సి.రమణ,శ్రీ కె.రామమోహన్,శ్రీ సి.యోగి ,శ్రీ సి.హర్ష
ఉపయోగించిన వాహనములు-మార్నింగ్ స్టార్,శాంభవి (A.C)సరికొత్తబస్సులు.-వానిని నడిపినవారు భాషా,మస్తాన్ రెడ్డి,శ్రీనివాస్,వాసు వెంకటేష్
పై మేమందరము 21-5-2012నవిజయవాడలోకలిసి రాష్ట్రీయ సువిధ సేవాసమితి కార్యాలయమునుండి యాత్ర శ్రీ ఏం.రఘునాధ్ గారిచే (శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థాన కార్యనిర్వాహణాధికారి)ప్రారంభింపజేసి రాత్రి 11-15ని||లకు బయలుదేరి గుంటూరు,వినుకొండ మీదుగా పయనించి 22-5-12 తేదీ ఉదయము 7గంటలకు జేరిభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను సేవించి అదే రోజు రాత్రి 7గంటలకు బయలుదేరితిమి.దోనాల,ఆత్మకూరు,కర్నూలుమీదుగా ప్రయాణించి 23తేదీ ఉదయము అలంపురాక్షేత్రమునకు వచ్చితిమి.అక్కడశ్రీజోగులాంబసమేతబాలబ్రహ్మేంద్రస్వామివార్లనుసేవించి మార్గమధ్యములో.(ఓర్వగల్లు) బుగ్గారామేశ్వరస్వామివారినిమరియు(కాల్వబుగ్గ)సంగమేశ్వరస్వామిని దర్శించితిమి.రాత్రి 7 గంటలకు బయలుదేరి 24-5-12 తేదిఉదయము 10 గంటలకు శ్రీ కాళహస్తి చేరి కలహాస్తీశ్వరునిదర్శించితిరుత్తణివెళ్ళిసుబ్రహ్మబ్రహ్మణ్యేశ్వరునిదర్శించిరేణుగుంట మీదుగా కంచిచేరివిష్ణుకంచిలోకంచికామకోటి పీఠాధిపతులవారిధర్మసత్రంలో బస చేసి మరునాడు శివకంచి కామాక్షీదేవి,ఏకాంబరేశ్వర స్వామీ,కామకోటి పీఠాథిపతులవారి దర్శనము అరుణాచాలక్షేత్రమువచ్చి 25 న అక్కడనుండి రాత్రి బయలుదేరి తిమి.
క్రిందివిధముగా మా ప్రయాణము సాగినది.
తేదీ చూచిన ప్రదేశములు
26 -5-12 ----చిదంబరంలో నటరాజస్వామి,వైదీశ్వరంలో అంగారకస్వామి,వైదీశ్వరస్వామి,స్వామిమలైలో సుబ్రహ్మణ్య స్వాముదర్శనం,తంజావూరు క్షేత్రంలో బృహదీశ్వరా స్వామి వారి దర్శనం
27-5-12 ---రామేశ్వరం లో పర్వత వర్ధినీ సమేత రామనాధ స్వామివారి దర్శనం ధనుష్కోటి నవపాషాణ దర్శనం
28-5-12 ----తిరుచ్చoదూరు,త్రిపురగుండం,అలగారుకోయల్ క్షేత్రాలలో సుబ్రహ్మణ్య స్వామి వార్లను 29-5-12 చూచిపళనిచేరి,సుబ్రహ్మణ్యస్వామి వారిని దర్శించి శ్రీ రంగం లోరంగనాధుని దర్శించి జంబుకేశ్వరం లో నుండి రాత్రి పది గంటలకుబయలుదేరిచాముండేశ్వరి కొండ,మదనపల్లి,సంగారెడ్డి శంకరంపేట,షోలాపూర్ మీదుగా
1-6-12 న కొల్హాపూర్ చేరితిమి. భీమేశ్వర స్వామిని చూచితిమి
2-6-12 కొల్హాపూర్ నుండి భీమశంకరం వచ్చి త్య్రంబ కేశ్వరస్వామినిద ర్శించి
3-6-12 నత్య్రంబక క్షేత్రములో ఘృష్మేశ్వర క్షేత్రంలో . ఘృష్మేశ్వర స్వామినిదర్శించి ఎల్లోరాగుహలకు వెళ్ళి చూచి సోమనాధ్ కి బయలుదేరితిమి. 5-6-12న సోమనాధ్ చేరిసోమనాధుని దర్శించి . హరిణా,కపిలా,సరస్వతీ నదుల సంగమం చూసి,నాగనాధ్ వెళ్లితిమి.
6-6-12 -సోమనాధుని దర్శించి గోమతిద్వారకలో ,భేటీ ద్వారకలో కృష్ణుని ఛోటిల్లా క్షేత్రమునకువెళ్ళితిమి.
7-6-12 -చండీ,చాముండీఅమ్మవార్లను దర్శించి ధాకోర్ క్షేత్రములో కృష్ణుని చూచితిమి.అక్కడ నుండి
8-6-12 -ఓంకార్ క్షేత్రంచేరి ఓంకారేశ్వరస్వామినిదర్శించి అమలేశ్వరస్వామిని దర్శించిఉజ్జయినికి బయలుదేరి
9-6-12 నమహాకాళేశ్వరస్వామి ,మహాకాళీ,హరసిధ్ధిమాత, కాలభైరవస్వామి, సాందీపని ఆశ్రమము,విశ్వామిత్రుని గుహలు,నాగచండీశ్వరదర్శనము కలిగినవి.అట నుండి హరిద్వార్ నకు ప్రయాణించి
11-6-12 నకుచేరిమానసాదేవి,చండీదేవి,మాయాదేవి,దక్షయజ్ఞం ల దర్శనములైనవి ,అక్కడనుండి కేదారనాధ్ నకు ప్రయాణమైరాంపురం మీదుగా
13-6-12నకేదార నాధ్ చేరి కేదారేశ్వర స్వామిని దర్శించి బదరీనాధ్ క్షేత్రమునకుబయలుదేరితిమి.
14-06-12 రాత్రి బయలుదేరి 15-06-12 ఉదయము బడరినాద్ చేరిబదరీనాధునిదర్శించి అచటనే ఉన్న బ్రహ్మకపాలమున పితృ తర్పణము జేసి ఆ రోజు రాత్రి బయలు దేరితిమి.
15-06-12 న హరిద్వార్ చేరి 16-06-12 న రాత్రిబయలుదేరి 17-06-12 నైమిశారణ్యము గుండా
18-06-12 న అయోధ్య చేరితిమి.రాములవారి దర్శనము చేసుకొని బయలుదేరి అల్హాబాదునకు చేరి మాధవేశ్వరస్వామిని దర్శించి వారణాసికి బయలుదేరితిమి.
19 -06-12 కాశీ చేరి విశ్వేశ్వరుని దర్శించి గయకు బయలుదేరి
20 -06-12 న చేరి మంగళగౌరి,విష్ణుపాదము,వట వృక్షం లనుదర్శించి పితృ తర్పణములనొనర్చి వైద్యనాద్ బయలుదేరితిమి.
21-06-12 న వైద్యనాధుని దర్శించి జాజిపూర్ నకు బయలు దేరితిమి.
22-06-12 న రాతికి చేరి గిరిజాదేవి దర్శనము జేసుకొని అరసవిల్లికి బయలుదేరి
23-06-12 న చేరి సూర్యనారాయణ దర్శనముజేసుకొని శ్రీ కూర్మము వెళ్లికూర్మావతార దర్శనము చేసుకొని సింహాచలము వెళ్లి నృసింహ స్వామిని దర్శించి
24-06-12 న పిఠాపురంవచ్చి కుక్కటేశ్వరస్వామిని దర్శించి ద్రాక్షారము జేరి భీమేశ్వర స్వామిని సేవించి కోటిపల్లి రేవులో అవబృధ స్నానముచేసి రాత్రి 10 గంటలకు విజయవాడకు బయలు దేరితిమి.ఈవిధముగా మా యాత్ర సమాప్తమయినది.
15, మే 2017, సోమవారం
వంశక్రమము
వంశక్రమము
తాతపూడి వారిది
గోత్రం-వశిష్ఠ గోత్రం
ఋషులు --1.వాశిష్ఠ 2.మైత్రావరుణ ౩.కౌండిన్య
కొంతమంది వాశిష్ట,ఇంద్ర,ప్రమద త్రయా రుషేయం అని కూడా చెప్పుచున్నారు.
గ్రామము-మంచిలి పశ్చిమ గోదావరిజిల్లా .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము .
నాకు తెలిసినంతవరకు ఇక్కడ కొన్ని విషయాలను పొందుపరచుచున్నాను.
చిట్టివేంకటేశ్వర్లు,వెంకమ్మగార్లకుసుబ్రహ్మణ్యంగారు జన్మించిరి .వారికి జగదాంబ గారితో వివాహమైనది.వారికి సత్యనారాయణ అను కొమరుడు కలిగెను .వారికి భార్యగా వెలగదుర్రు గ్రామనివాసియైన భాస్కరంగారికొమరితయగు వెంకటరత్నంగారు వచ్చిరి.వారికి భాస్కరుడు,రాజ్యలక్ష్మి (పిచికమ్మ),పొట్టమ్మ అను వారిసంతానం.భాస్కరం భార్యసూరమ్మ-వారిసంతానం -సత్యనారాయణ,వెంకటేశ్వర్లు ఇద్దరుకుమారులు.
సత్యనారయణ భార్య రమాదేవి .వెంకటేశ్వర్లుభార్య పేరు వెంకటరమణ -వారి సంతానము-సాయిభాస్కర్,సత్యవతి సుబ్రహ్మణ్యంగారు తన భార్యయగు జగ్దాంబగారు గతించిన తరువాత వేంకటరత్నం గారితో వివాహమైనది.వార్కి నలుగురు కొడుకులు,ఒక కుమార్తె కలిగిరి.
ప్రధమకుమారునిపేరుమృత్యుOజయ(ముత్తన్న) వారిభార్య లక్ష్మమ్మ .వీరు దత్తతకు వెళ్ళినారు.సంతానము కలుగలేదు.అల్లంరాజు సత్యనారాయణను దత్తత తీసుకొ ని మల్లి అను ఆమెతో వివాహము చేసిరి.వారికి కూడా సంతానము కలుగ లేదు.
ద్వితీయ కుమారునిపేరు -సూర్యనారాయణవారిభార్య మంగమ్మగారు .వీరు ప్రస్తుతము జీవించియున్నారు .వారి సంతానము-విజయలక్ష్మి,రేణుకాదేవి,ప్రసాదు అను కొడుకు కలిగెను కాని అతడు చిన్నతనానగతించెను.
విజయలక్ష్మికికోటబాలకృష్ణమూర్తిగారితోవివాహమయ్యెను,వారిసంతానము,బుజ్జి,రాణి,సౌజన్య అను నల్గురు కుమార్తెలువారందరికీ వివాహములైనవి.సంతానములు కల్గియున్నారు.
రేణుకాదేవికి రావూరి విజయ గోపాలకృష్ణమూర్తి తో వివాహము జరిగెను.జ్యోతి,మురళి,సూరిపండు,రాధ అను వారలు వారి సంతానము.సూరిపండు తప్ప మిగిలిన వారికి వివాహములైనవి. జ్యోతిభర్తఇటీవలమరణించెను.వారిసంతానము సాయి,శ్రీనిధి .
మురలిభార్యపేరు శాంత వారికి ఇద్దరు కొడుకులు(కార్తీక్ ,సూరిపండు). రాధకు ఇద్దరు పిల్లలు.వారు దుబాయ్ లోనున్నారు.
తృతీ య కుమారుడు రామమూర్తి మొదటిభార్య జగదాంబ వారిసంతానము విష్ణుప్రసాదొక్కడే అతనికి రాధ,కిశోర్ అనువారు పిల్లలు.రాధకు వెంకటేశ్వర్లుతో వివాహముజరిగెను.వారికి శరత్ ఒక్కడే కొడుకు.కిషోర్ భార్య ప్యారీ.వారు శరణ్య అను అమ్మాయిని దత్తత తీసికొ నిరి.ఇక రెండవ భార్య సత్యవాణితో వివాహమైనది.వారికి సూర్యనారాయణ,రత్నం,సుబ్బయ్య,శ్రీనివాస్,గోపాలుడు అనువారిసంతానము.సూర్యనారాయణ భార్య మహాలక్ష్మి.వారి కి రామకుమార్,సందీపకుమార్ అను ఇద్దరు కొడుకులు.రత్నం భర్త కాకరాలనాగేశ్వరరావు.వారికి నీహారిక,ఆదిత్యవారిసంతానం.హారికకుయనమండ్ర అమరకాంతతోవివాహమైనది.ఇద్దరుపిల్లలు(మైత్రేయి,ఐతరేయమహర్షి).ఆదిత్య భార్య పేరు సువర్చల భావజ్ఞ ,మనోజ్ఞ,అని ఇద్దరుపిల్లలు.సుబ్బయ్య భార్య పేరు వల్లి వారికి శ్రీకర్,శ్రీధర్,అని ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ భార్యపేరుప్యారీ.శ్రీనివాస్ఇద్దరుపిల్లలను(ప్రేమచoద్,సంత్ చరణ్ )కనిగతించెను.వీరుఇంజనీరింగ్ చదువు చున్నారు. గోపాలుని భార్యపేరు వాణి.వారికి ఇద్దరుపిల్లలు.(శ్రీ వివేక్,అభిషేక్ )వీరు వేదపఠనము చేయుచున్నారు.
సుబ్బయ్య గారి నాల్గవ కుమారుడు కృష్ణమూర్తి..వారి భార్య కామేశ్వరి.వారికి సుబ్బయ్య,పద్మ,శేషు,శంకర్,రామకృష్ణ అను వారి సంతానము.సుబ్బయ్య భార్య కామేశ్వరి.వారికోకమనుమరాలున్నది.కొడుకున్నాడు.పద్మ,శేషులకు వివాహములైనవి.పిల్లలు గలరు.శంకరము భార్యకళ్యాణి మణికంఠ,సుధవారి సంతానం.రామకృష్ణ భార్య పార్వతి.ఫణికృష్ణదత్తు,కామేశ్వరి వారి సంతానము.
సుబ్బయ్య గారి ఏకైక కుమార్తె సీతామహాలక్ష్మికి రావూరి సత్యనారాయణతో వివాహమైనది.వారిసంతానం విజయ గోపాల కృష్ణమూర్తి ,సూర్యనారాయణ,జనకమ్మ .వీరిలో జానకమ్మ చిన్నతనాన గతించినది. .గోపాలకృష్ణమూర్తి గూర్చి సూర్యనారాయణగారి వద్దచెప్పబడినది.సూరికి సుబ్రహ్మణ్యేశ్వరితో వివాహమైనది.వారికి విశ్వనాధం,సీతామహాలక్ష్మి అని ఇద్దరు పిల్లలు.విశ్వనాధంభార్య సౌజన్య,సీతామహాలక్ష్మి భర్త హరి.వారిరువురికి చెరొక కొడుకు గలరు.
@@@@@@@@@@@@@@@
కవితావైచిత్రి
క్రింది పద్యమును పరికించoడి
వంగతోట నుండు వరిమళ్ళలో నుండు,
జొన్న చేలనుండు చోద్యముగను ,
తలుపు మూలనుండు తలమీద నుండు
దీని భావమేమి తిరుమలేశ?
1.వంగతోటలోను,2.వరిమళ్ళలోను,3.జోన్నచేలలోను,4.తలుపు మూలలోను,5.తలమీదనుకూడచోద్యముగానుండు నవి ఏవి?--అను ఈ ఐదు ప్రశ్నలు మొదట భ్రాంతిని కల్గించి చిత్తాన్ని చిక్కుల్లోకి తోసివేస్తున్నాయి.
29, ఏప్రిల్ 2017, శనివారం
భారతదేశపు రాజచిహ్నము
భారతదేశపు రాజచిహ్నము
భారతదేశపు రాజచిహ్నమైన నాలుగు సింహాలముఖములు కలిగిన ముద్ర నాలుగుసత్యాలను సూచిస్తాయి.
1.లోకంలో దుఃఖం ఉంది. 2.దుఃఖానికి కారణముంది. ౩.దుఃఖాన్ని దూరం చేసుకోవచ్చు. 4.దుఃఖాన్ని తొలగించుకోవటానికి మార్గముంది.జాతీయ జెండా లో అశోక చక్రం కన్పిస్తుందిఆ అశోకచక్రంలో 24 దళాలు కన్పిస్తాయి.1.ప్రేమ 2.ధైర్యం ౩.సహనం 4.శాంతి 5.కరుణ 6.మంచితనం 7.విశ్వాసం8మృదుత్వo 9.సంయమనం10.త్యాగనిరతి.11.ఆత్మార్పణ.12.నిజాయితీ 13.సచ్ఛీలత 14.న్యాయం 15.దయ 16.హుందాతనం 17.వినమ్రత 18.సహానుభూతి 19.జాలి 20.చెడు చెయ్యాలంటే భయం 21 .సరైనజ్ఞానం22 .చక్కనిఅనుభవజ్ఞానం23.మంచినీతి24.లోకంమంచితనంపైన. మ్మకం,విశ్వాసం,ఆశ.
పై 24 భావాలు మానవుని మహనీయునిగారూపుదిద్దుతాయని మహానుభావులచే అశోక చక్రం తయారు చేయబడినది.ఇవి భారతీయుల రక్తంలో అంతర్లీనంగా నున్నాయి.
7, ఏప్రిల్ 2017, శుక్రవారం
అన్న దాన మహిమ
అన్నదానము
పూర్వము జనాభా తక్కువగా నుండుట చేతను,మానవులలో పాపభీతి, దైవభక్తి,ఏకాగ్రత,మున్నగు సుగుణములుండుటచేకీర్తి కాముకులై దానగుణముకలిగియుండెడివారు.అన్నికులాలవారు కొద్దో,గొప్పో దానాలు చేసేవారు.బలి,కర్ణుడు,శిబి మున్నగు వారినిఉదాహరణగా గ్రహించవచ్చును.దానాలలో అన్నదానముపూర్వము నుండి ఇప్పటివరకు అనేక ఉత్సవాలలో అన్నదానము చేయుచుండుట జరుగుచున్నది.ఉత్తమ గ్రంధమైన రామాయణములో రాముడు అరణ్యవాసానంతరము పట్టాభిషిక్తుడైన హనుమంతునిని బీదసాదలకు దానం చేయమని యాదేశించినాడట.ఎన్నోదినాలు,ఎంతోఉత్సాహముతో,అన్నవస్త్రాలు దానము చేసినా అన్నమో రామచంద్రా,ఆలో లక్ష్మణాఅంటూ వచ్చిన జనం మాత్రం తగ్గలేదట.అలసిన హనుమానుడు మాత్రం వచ్చిన వాళ్ళను తర్జిస్తూ,భర్జిస్తూ,ఏ కొద్దో,గొప్పో వారి ముఖాన విసరడంతో,క్రమంగా అర్ధి జనులు ఆగిపోయారుట.దీనికిష్టపడనిరాముడోకనాడు నగరంలో తిరుగు చుండగా ,త్రోవలో ఒకవంకరమూతిగల సన్న్యాసి ఎదురు పడిన వానికి నమస్కరించి మహానుభావా!అంటా బాగానే యుంది నీకు ఆ పంది మూతిఎలావచ్చింది అనిఅడిగెనట.అప్పుడాతడుక్రింది విధంగా చెప్పెనట.
శ్లో|అన్నదానం మయా దత్తం రత్నాని వివిధానిచ
నదత్తంమధురై ర్వా క్యై :తే నాహం సూకరాన్వయ :
ఓ రామా!పూర్వజన్మలొ నేనెన్నో అన్నసంతర్పణలు చేసాను.కాని ఆ చేసే దానం భక్తిశ్రద్ధలతో,వినయవిధేయతలతో ,మంచి మాటలతో చేయలేదు.అందుచే ఈ జన్మలో నా మూతి పంది మూతి యైనది.అని చెప్పెను.దానిని రాముని వెంతయున్న ఆంజనేయుడు విని అందులోని పరమార్ధాన్ని గ్రహించి ప్రియంతోపలుకుచు భక్తితో దానం చేయడం మొదలు పెట్టాడు.దీని వలన అన్నదానమహిమ ఎంతగొప్పదో మనము గ్రహించవలెను.
6, ఏప్రిల్ 2017, గురువారం
అత్తారిల్లు
అత్తారిల్లు
అత్తారిల్లుఅంటేచాలామందికియిష్టముగను,యిష్టముగను,భయంగాను కనబడుతుంది.చాలామంది తమభార్యలపై ప్రేమతో అత్తవారింటఉండటానికి సిధ్ధ.మౌతారు.అట్టివారు తమ అభిప్రాయాలను క్రింది శ్లోకంలో తెలియ బరచినారో గమనించండి..
శ్లో.శ్వశురగృహనివాసఃస్వర్గతుల్యోనరాణాం
యదిభవతిరిద్రో పంచవాషడ్దినాని
దధి మధు ఘృత లోభాత్ మాసమేకం .వసేత్ చేత్ తదుపరి దినమేకం పాదరక్షా ప్రయోగః
అత్తవారిల్లు ఎట్టిది?అను ప్రశ్నకు సమాధానము పై శ్లోకంలో దర్శనీయమగు చున్నది.
ఒక మామ గారింట్లో నల్గురుఅల్లుళ్లు ఉన్నారు.ఒకేసారి మను గుడుపు (వివాహానంతరం అత్త వారింట్లోఅల్లుళ్ళకుచేసేవిందు) ల కోసం వచ్చినారట.ఎంతధనం, ఓపిక,ప్రేమ గలవారైనా ,ఎంత బాగా పెట్టాలనుకున్నా ,ఎంతకాలమని ,అల్లుళ్ళకు తినుబండారాలు,సేవలు చేయగలరు?వారికి మాత్రము విసుగు పుట్టదా?ఇలా ప్రతిదినం పీకలవరకుమెక్కి ,మేలమాడుకుంటున్న సమయంలో ఒకరికి బుధ్ధి వచ్చి ,అత్తవారిల్లు అన్నీ విధాలా స్వర్గసుఖాలలో ఓలలాడి స్తుంది అనే అర్ధం వచ్చు పై శ్లోకంలోని ప్రధమపాదo అత్తవారింటగోడపై వ్రాసి వెళ్ళేనట. .మరి కొన్ని రోజులకు రెండవ వానికి బుధ్ధి వచ్చి ,అత్త వారిల్లు ఎంత స్వర్గసీమయైన 5,6రోజులకంటే మించి యుండరాదను అర్ధము వచ్చేటట్లు రెండవపదాన్ని గోడపై వ్రాసివెళ్ళేనట.
మరికొన్ని రోజులు మెక్కి అజీర్ణం తెచ్చుకొన్న మూడవ వాడుఅత్తవారింటఅనాయాసంగాపెరుగు,పాలు,పిoడివంటలు వడ్డిస్తున్నారను అర్ధము వచ్చేటట్లు మూడవపాదాన్ని వ్రాసి మాయమైనాడట.ఇక నాలుగవవాడు మాత్రం,తిని,తేపి , వారిమీద పెత్తనం కూడా చేస్తూ ,అవి కావాలి,ఇవి కావాలి అని అధికారం చెలాయించడంతో ,పాపం ఎంత బావమరుదులైన ఏమి చేస్తారు?ఎంతకాలమని భరిస్తారు? ఏమి చేయునది లేక కోపముతోచెప్పుతో నెత్తి మీది బొచ్చు ఊడేటట్లునాలుగు దెబ్బలుకొట్టారట.దానితో ఆ నాలుగవవాడు పారిపోతూ,ఆదర బాదరగా తిండి మీది ఆశతో నెలల తరబడి తిష్టవేస్తే ,ఆ తర్వాతచెప్పు దెబ్బలు తప్పవు అనే అర్ధం కల నాల్గవ పాదం వ్రాసి పారిపోయాడు.
దీనినిబట్టి ఎంత ఆశపోతు,attతిండిపోతులైనా, అత్త వారింట్లో ఎక్కువ రోజులుండరాదని భావం.
4, ఏప్రిల్ 2017, మంగళవారం
చిత్రం
చిత్రం
చిత్రం అంటే మిత్రుల మధ్య గాని ఒకరిదేగాని కావచ్చు .
శ్లో.కిం చిత్రం యది రాజనీతి కుశలోరాజా భవే ద్ధార్మికః
కిం చిత్రం యది వేదశాస్త్రనిపుణోవిప్రోభవేత్పండితః
తచ్చిత్రం యది రూప యౌవనవతీతన్వీభవేత్కామినీ?
తచ్చిత్రం యది నిర్ధనోపి పురుషః పావం న కుర్యాత్ క్వచిత్
ప్ర.1.మిత్రమా!రాజనీతిలోరాటుదేలినకొందరు,ధన,అధికార,దాహాలతో,పైకి కనబడకుండా ఎన్నో పిచ్చి పనులు చేస్తారు.అలా కాకుండా రాజనీతిలో ప్రజ్ఞాశాలియైన రాజు కూడా ధర్మాచరణలో పుణ్యా త్ముడైనచో,దానిలో ఆశ్చర్య కర విషయమేమున్నది ?
ప్ర 2.వేదశాస్త్రే తిహాసాలతో,నేతలైనఛాందస బ్రాహ్మణులు కూడా పండితులు కావటంతో పరమాశ్చర్య పద వలసిన పని లేదు. vఅంశ పారంపర్య ,సంస్కార,ప్రాంతీయ పరిస్దితులననుసరించి,త్యాగాస్దులైన ,పండిత పుత్రులైన,ఆ బ్రాహ్మణులు పాండిత్యం సంపాదించటంలో,అంట అద్భుతమేమి కనబడదు.
ప్ర౩.ఇక విచిత్రమేమిటంటే మిక్కిలి అందచందాలతో వలపు గొల్పు యువతి అగు భామిని కులటయై చెడిపోక ,భర్త ఎట్టివాడైన,విడువక పరమ పతివ్రతగా సేవించుటం,ఒక ఆశ్చర్య కర విషయమే.
ప్ర 4. అంతకన్నమరొక గొప్ప విచిత్రమేమిటంటే ,చేత చిల్లి గవ్వయైనలేని,దరిద్రదామోదరుడు,ఎంతహీనస్ధితిలోనున్న,ఎన్ని కష్టాలు ఎదురైనా,కడుపు కడివెడాకాలితో మాడుతున్నా,ఆ కూటి కోసం కోటి విద్యా ధనా వకాశాలున్నా ,అట్టి పాపకార్యాలు చేయక,నిరాడంబరంగానీతిగాజీవించడంచిత్రాతివిషయమన్నమాట.
18, మార్చి 2017, శనివారం
లక్ష్మిపార్వతుల సంభాషణా పద్యం
బందరులో తిరుపతి వేంకట కవుల అష్టావధానం లో క్రింది పద్యం చెప్పబడినది సీ ||గంగాధరుoడు నీ మగండని నవ్వoగవేష ధరుడు నీ పెన్మటనియె,
ఎద్దునెక్కును నీదునెమ్మికాడనినవ్వగ్రద్దనెక్కునునీదుమగండటనియె వల్లకాడిల్లు నీ వల్లభు నకనంగ-నడిసంద్రమిల్లు నీ నాధునకనె,
నాట్యంబు సేయు నీ నాయకుండన -హంగు కావింషు నీ కాంతుడనియె
గీ||ముష్టికెక్కడికే కేగె నీ యిష్టుడనిన
బలి మఖంబున కేగెనో లలన!యనియె,
ఇట్టులన్యోన్య మర్మంబులెంచుకొనెడి
పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతు .
లక్ష్మి::1..పార్వతీ !నీ భర్త కావడితో నీళ్ళు మోసేవాడే!(గంగనుదాల్చినవాడే)
పార్వతి :నీ భర్త నానా వేషాలు వేసే నటుడు (అనేకావతారాలెత్తినవాడు )
లక్ష్మి:2.నీ ప్రియుడు నందినెక్కి (ముసలి ఎద్దునెక్కి)తిరుగును.
పార్వతి::నీ భర్త గ్రద్దనెక్కి తిరుగుట లేదా!
లక్ష్మి:3.నీ :ప్రియునికి శ్మశానమెయిల్లు
పార్వతి:అవును.నీ నాధుని యిల్లు నడిసముద్రమేగదా!
లక్ష్మి:4.అడుక్కోవటానికి నీ మగడెక్కడికివెళ్ళాడో ?
పార్వతి:మూడడుగుల స్ధలం కోసం అడుక్కోడానికి బలి యజ్ణ భూమికివెళ్ళాడు.
(మొత్తమ్మీద దేవ దేవేరులకు కూడా తప్పలేదు.ఈ ఎత్తిపొడుపులు)
24, ఫిబ్రవరి 2017, శుక్రవారం
విచారణ
సహజపండితుడైన బమ్మెర పోతన రచించిన భాగవతంలో క్రింది పద్యమును పరిశీలించిన అనేక విషయాలు కనబడతాయి.
గజేంద్రమోక్షంలో మొసలిచే పీడింపబడుచున్న గజేoద్రుడు మొర పెట్టుకొను సందర్భంలోని పద్యమును చూడుడు.
కం||నర్తకునిభంగి బెక్కగు
మూర్తులతో నెవ్వడాడు?మునులు దితిజులుం
గీర్తింప నేర?రెవ్వని
వర్తనమొరులెఱుగ రట్టివారి నుతింతున్.
ఎనుబది నాలుగు లక్షల రకాల జీవరాశులతోను,ఒక్కొక్క రకానికి కోటానుకోట్లుగా రూపములు ధరించి ఆయా రూపనామమునకు తగినట్లుగా నటించు ఆ నటనా సార్వభౌముడైన వాడెవ్వడు?మనమున్ను చేయు ఇష్ట కామ్యఫలసిద్ధికై గాని,లేదా,మోక్షమునకైగాని,దేని గురించైనాసరే సాధనప్రారంభించుటకు ముందుఈ ప్రశ్న ఎవరికి వారే ప్రశ్నించుకొందుముగాక.ఇది మన భవిష్య త్కార్యక్రమమునకు తోడ్పడుతుంది.ఇక్కడనుండి సాధకుని "ఆత్మాన్వేషణ"ప్రారంభమౌతుంది.అదే భగవద్దర్శనమునకై అన్వేషణ యనబడును.ఇష్ట కార్య సఫలతను పొందుటకు వెళ్ళవలసినమార్గము,చేరవలసిన గమ్యము ,పొందవలసిన ఫలము ,ఇవన్ని ఇక్కడ నిలబడి ఆలోచించాలి.
బజారులో ఒక్కొక్క దుకాణంలో ఒక్కొక్కరకమైన వస్తువులే దొరుకుతాయి.ఉదాహరణకు పువ్వులకొట్లో కి వెళ్ళి కట్టె లడిగితేదొరకవు గదా. అలాగే వివిధవస్తువుల భండార్ అనేదిఒకటిఉంటెఅక్కడసర్వవస్తువులులభించునన్నమాట.యికనాలుగువస్తువులకినాలుగుదుకాణములగుమ్మాలెక్కి దిగవలసిన పనిలేదుగదా.అటులనే నానా రకాలైన మతాలు,నానారకాలదైవములు,యివన్నీదుకాణాలనిపించుకుంటాయి. వీట్లలో ఒక్కొక్క వస్తువు మాత్రమే దొరుకుతాయి.కాని అన్ని వస్తువులకు నిలయమైన,అన్ని మత,సిధ్ధాoతములధ్యేయమైన,దైవమేదైతేయున్నదోఅట్టి దేవాదిదేవుణ్ణి చేరుకోడానికి ప్రయత్నించాలి. .అట్టి మార్గములో పయనించి పరమాత్మను దర్శించి బంధనివృత్తి అనెడి మోక్షానందఫలమును పొంది అనుభవించాలి.ఆ గమ్యము చేరిననీవువివిధవస్తుభండార్ అనే సర్వ వస్తుప్రాప్తానందస్ధితినిపొందిఆనందించగలవు.
అట్టి ఆనందస్ధితినే "బ్రహ్మానందం,పరమసుఖదo "అని చెప్పబడినది.ఆ స్ధితికై ఫలమునిచ్చు దైవము సర్వ శరీరములనే వివిధ వేషము ధరించి,తాను తానైవుండి ఆ యా దేహమునకు తగినట్లుగా నటించుచున్నవాడు నటులలోకెల్లశ్రేష్ఠుడు అయిన ఆత్మశక్తియే .కాన ఆత్మశక్తిని తెలుసుకొని దానిని పొందుటకు చేయు ప్రయత్నము నిజమైన ప్రయత్నము.అందుకే గజరాజు చాల తీవ్రముగా తన్ను తాను ప్రశ్నించుకున్నాడు.నర్తకుని భంగి పెక్కగు మూర్తులతోనెవ్వడాడు "అని.
ఇక ఆత్మశక్తిని తెలుసుకొనియింత అంతియనిగాని చెప్పడానికి,వర్ణించడానికి,ఇది,అది,యనిగాని,చూపడానికి సాధ్యపడేదిగాదు.అది ఎంతటివారైనసరే --మునులుగాని,వేదవేదాంగ పండితులకు గాని అసాధ్యమే!మరెలా?గురువు చూపిoచడా?అని ప్రశ్నించుకొంటే గురువు కేవలము గురుతు మాత్రమె చూపగలడు.అంటే తాను వెళ్ళుమార్గమునుచెప్పగలడుగానిదానిగూర్చిచెప్పుటకధికారము లేదు. చేప్పాలనుకున్నా అక్షరమాల సరిపోదు.ఆత్మను గూర్చి సరిగ్గా తెలుసుకుంటే యిక వాడు చెప్పవలసినది లేదు.చేయవలసినదేమియులేదు. అవధులు దాటిన అవధూత యగును. .అట్టివానికి దైవపిచ్చి తప్ప అన్యపిచ్చిలేదు.ఆ స్ధితిలో వారు సర్వస్వతంత్రులు.చెప్పవలసినది,చేయవలసినది అనే బంధము బాధ్యత వారికి లేవు.ఉండవు.ఇదే జీవన్ముక్తస్ధితి అనగాజీవించియుండగానే(శరీరములోయుండగానే)ముక్తిని అనుభవించుట.జ్ణాన నేత్రము గలవాడు,మాత్రమే చూడగలడు.గ్రహించగలడు .అనుభవించగలడు..అని భగవానుడే చెప్పెను.అయినా సాధకులుఉత్సాహములో సాధన చేయమని,అది చాలా అసాధ్యమైనదని చెప్పబడినది.అందుకే గజేంద్రుడు మునులు,పండితులు సైతం ఎవనిగూర్చి సంపూర్ణంగా కీర్తింపజాలరో అట్టి వానిని శరణు .జొచ్చెదనని చెప్పెను.
ఎవ్వని వర్తనమొరులెరుగరో?.అంటాడు గజేంద్రుడు.నానా విధములైన ,నానారకాలైనఅనేక విధములగు రంగులు,వాసనలు కల పువ్వులన్నియు ఒకానొకదానిపై ఆధారపడి "మాల"గా రూపు ధరించుచున్నది.మాలకు ఆధారము దారము కంపించదు.అటులనే సమస్త జీవరాశులు,పంచ భూతములు అనే పువ్వులు "ఆత్మశక్తి"అనే దివ్యశక్తిపై ఆధారపడిప్రపంచాన్ని మాలగా రూపు దాల్చినది.ఎవ్వరును ఆ శక్తిని మాంసపు కన్నులతో సద్గువు సాయము లేనిదే చూడలేరని పోతన పై పద్యము ద్వారా మనకు తెలియజేసినాడు.
23, ఫిబ్రవరి 2017, గురువారం
kavitavaichitri
కవితా వైచిత్రి
. క్రింది పద్యములో ప్రత్యుత్తరాలుండటంరెండుప్రశ్నలకొక్కటే చిత్రంగా సమాధానం కావటం విశేషాలు.
ఎద్దీ శునకశ్వoబగు?-కృషిని లెద్దానివాంఛింతురెల్లయప్డు ?
విడెమునెద్దాననొక్కంగగడగునరుడు? "పంట"నని యుత్తరము చెప్పువాడ,సఖుడ!
ప్ర :1 .ఏది (ఎద్ది)ఈశ్వరునికి వాహనమగునవి?
జ:ఎద్దు -శివుని వాహనము.
ప్ర 2.కర్షకులు అన్ని వేళల యందు దీనిని కోరుకొందురు?
ప్ర 3..మానవుడు .తాంబూలమును (వక్కాకును,విడెమును)దేనితో నొక్కి కోరుకును?
పై రెండు ప్రశ్నలకు పంటన్ -అనునది ఒక్కటే సమాధానము.ఎలా?-రైతులు పంటనే కోరుకొందురు.
నరుడు తాంబూలమును దంతములతో (పన్నులతో,పంటన్).కొరుకునుగదా .
18, ఫిబ్రవరి 2017, శనివారం
కవితావైచిత్రి
క్రింది పద్యమును పరిశీలన చేసిన పది ప్రశ్నలు కనబడును.వానికన్నింటికిఒకేపదము(రెండక్షరాలుగలది)సమాధానమగును.ఇది నియమము.
సీ.ఏకచక్రమునెక్కురేబెవ్వడు2ఒడలెల్లగనులైనయెడయ డెవడు?
3.మఱ్ఱి యాకున బండు కుఱ్ఱ వాడెవ్వడు?4.శివుని యౌదల జేరి చెలగునెవడు ?
5.సమతమై సర్వ భూతముములనేలునెవడు?6.వాయు
భక్షణచేసిబ్రతుకునేది?
7.అఖిల జివనంబులకాధారమగునేది?8.కొమరార మారుని
గుఱ్ఱమేది?
9.కంధి చాటి లంక గాల్చిన మృగమేది?10.క్షితిని జల్లబడగ
జేయునేది?
ఈ నియమాన్ని అనుసరించి (హరి)అనునదొక్కటేసమాధా నమగును.
1.ఒకే చక్రము గల బండినెక్కి తిరుగు వాడెవ్వడు?
హరి (సూర్యుడు)
2.దేహమునిండాకన్నులు గలవాడెవడు ?
హరి(దేవేంద్రుడు )
3.మఱ్ఱి యాకుపై పరుండు బాలుడెవడు?
హరి(కృష్ణుడు)
4.శివుని శిరస్సుపై ప్రకాశించు వాడెవడు?
హరి (చంద్రుడు)
5.సర్వ ప్రాణులను సమానంగా పాలించు వాడెవ్వడు?
హరి (యముడు)
6.గాలిని మేసి బ్రతుకునేది?--హరి (పాము)
7.సర్వ ప్రాణులకు ముఖ్యాధారమేది?--హరి (గాలి)
8.మదనునకు సుందర వాహనమేది?--హరి (చిలుక)
9.సాగరం దాటి లంకా దహనము చేసిన మృగమేది?
హరి (కోతి)(హనుమంతుడు)
10.భూమిని చల్లబడునట్లు చేయునదేది?--హరి (వాన)
హరి శబ్దానికి నానార్ధాలు :
యమానిలేంద్రచంద్రాదర్క విష్ణు సింహాం శువాజిషు !
శుకాహికపిభేకేషుహరిర్నా,కపిలేత్రిషు (అ.కో.)
5, ఫిబ్రవరి 2017, ఆదివారం
kavitaavaichitri
క్రింది శ్లోకాన్ని పరిశీలిస్తే ఒకే సమాధానము వచ్చేప్రశ్నలు కనబడతాయి.
పూ:కీ దృక్ ?కా మాధవేష్టా?యతే ర్వాక్ కీ దృక్?కంపాహీ శ్వరే త్యాహ భక్తః ?
ఆదే రాదే రుద్ధృతైకైకవర్ణః శబ్దస్తేషూ త్తరo నైవమంతే |
పై దానిలో ని నాల్గు ప్రశ్నలకు "రామా రామా "ఒక్కటే సమాధానము.ఎట్లన దానిలోని మొదటి ఒక్కొక్క అక్షరాన్ని క్రమంగా తగ్గిస్తూ పోయినచో "మారామ ,రామా,మా,"గా విభాక్తములై ప్రత్యుత్తరాలగుచున్నవి.
ప్రశ్న :పట్టణముఎట్లున్నది?
జ:రామారామా =1.రామ +ఆరామా 2.రామా +ఆరామా 3.రామారామా =1.అందమైనతోటలతో గూడియున్నది.
2.సుందర భామలతోనిండిన ఉపవనాలు కలిగియున్నది.
3.అందము గల సుందరీ మణులు గల్గియున్నది.
2. విష్ణువునకు ఇష్టురాలెవరు?జ:(.రానుతగ్గింపగా)మారామా =రమాసుందరి,లక్ష్మి
3.సన్న్యాసి మాట ఎట్టిది?జ:మొదటి రా,మా,అనే రెండక్షరాలు పోగా ,మిగిలిన రా: ,మా =ధనము,వద్దు అనగా ధనాశ పనికిరాదని సన్న్యాసి భావము.
4.భక్తుడు ఎవరిని రక్షింపమనికోరును?
జ:మా (=నన్ను ).ఇది అస్మద్ శబ్దం యొక్క ద్వితీయైక వచనము .(మామ్-మా)ఆదినుండి క్రమంగా ఒక్కొక్క అక్షరం తగ్గించుటచే ,ఇది హీయమానాక్షరమైనది.
3, ఫిబ్రవరి 2017, శుక్రవారం
కవితావైచిత్రి
కవితావైచిత్రి
కవితారీతులలో సంవాదాత్మక రీతి మిక్కిలి తమ తమ సమాచారమును తెలుపు కొనుటయే కాని ఇట్టి సంవాదాలు శ్లేషతో,వక్రోక్తులతో,ఎత్తిపొడుపులతోలేకహాస్యంగానో,చమత్కారాలు చిందించటం సర్వసాధారణం.కేవలం సంభాషణచప్పగాఉంటుంది.దానిలోచమత్కారచందనాన్ని కలిపి పూస్తే ఆనందాన్ని అందిస్తుంది.ప్రస్తుతంఒక బావ తన మరిదితో ఎదుటనున్న ఆవులలో నొకదానిని తెమ్మన్నాడట.ఇక్కడ గద్యాన్ని పద్యరూపములో బంధించడం జరిగింది.
బావమరిదిoగనిఆ-యావులలోనొకటితెమ్మియనగానపుడే
యావని యడిగిన వాక్యము -గావలయున్ భాషలైదుగా నొక పదమునకున్.
పై ప్రశ్నా వాక్యాన్ని1.ఏ-2.ఆవ్ -3రా -4.బా -5.వా అని విడదీస్తేఅవి క్రమంగా 1.మహారాష్ట్ర 2.హిందీ 3.ఆంధ్ర 4.కర్ణాటక5.తమిళంభాషలైదింటిలోనుసమాధానమౌతుంది. అక్షరం భాష అర్ధం
ఏ మహారాష్ట్ర రమ్ము
ఆవ్ హిందీ రమ్ము
రా ఆంధ్ర రమ్ము
బా కర్ణాటక రమ్ము
వా తమిళం రమ్ము
ఇట్లు ఐదు అక్షరాలు గలఒక తెలుగు వాక్యంలోని ఐదు అక్షరాలు విడివిడిగా ,ఐదు భాషలలో,ఒకే అర్ధాన్ని చెప్పుచు సామూహికముగా ప్రశ్నావాదకం కావటం చిత్రాలలో మహావిచిత్రం.కాదనగలమా!
31, జనవరి 2017, మంగళవారం
కర్మ
కర్మ
మన భారత దేశమున అనేకమతాలు గలవు.అందుకే మన దేశాన పరమతసహనమునకాలవాలము.మనది హిందూ మతము.దీని యందు కర్మ సిద్ధాంతం మిక్కిలి ప్రధానం .ప్రపంచాన కనబడే హెచ్చుతగ్గులకు,తరతమభేదాలకు కర్మ సిద్ధాంతం సరియైన సమధానమునిచ్చును .
పుట్టిన జీవులందరు ఒకే విధముగా ఎందుకు లేరు?కొందరుసుఖమును,మఱికొందరు దు:ఖమును ఎందుకు అనుభవించు చున్నారు?ఇట్టి గడ్డు సమస్యలను కర్మ సిద్ధాంత మొక్కటే పరిష్కరించగలదు.
కారణములేకకార్యముండదు.అనే నియమముపై కర్మ సిద్ధాంతమాధారపడియున్నది.జీవులనుభవించుసుఖమునకైనను,దు:ఖమునకైననువారుపూర్వమాచరించినకర్మలేకారణము.సుకృతమొనర్చినవాడు సుఖమును,దుష్కృతమొనర్చినవాడు దు:ఖమును పొందితీరును.ఏ బీజమును నాటెదమో దాని ఫలమునే అనుభవింతుము కాని వేరే ఫలమును పొందలేముకదా .అటులనే మనము ఎట్టి కర్మ చేయుదుమో అట్టి ఫలమునే అనుభవింతుమనికర్మసిద్ధాంతము చెప్పుచున్నది .
ముందటి జన్మలో చేసిన కర్మలు గూడ ఈ జన్మలో ఫలించు చుండును.అలాగే ఈ జన్మలో చేసిన కర్మలు మరుసటి జన్మలో అనుభవానికివచ్చుటయుగలదు.ఆరోగ్యము,దీర్ఘజీవితము,సంపద,కీర్తి,అధికారముమున్నగునవిపుణ్యకర్మలచేకలుగుఫలములు.రోగము,అకాలమరణము ,బీదరికము మున్నగు దుష్ఫలములుపాపకర్మలచే కల్గును.జ్ఞానోదయమగునంతవరకు ఈ కర్మఫలములు నీడవలె జీవులను వెన్నాడుచునేయుండును.భగవద్గీతలో "జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కురుతే తధా" చెప్పినట్లుగా జ్ఞానమనెడి వహ్ని సమస్త కర్మలను దహించుచున్నది.జ్ఞానవంతులై భగవత్సన్నిధి కి జేరిన ముక్త జీవులకికకర్మతో ఎట్టి సంపర్కము లేదు.
కర్మానుగుణముగా జీవులకు పునర్జన్మ గల్గును.మానవుడు మరణిస్తే స్ధూల శరీరము మాత్రమే నశించును.సూక్ష్మశరీరము పూర్వకర్మలకు సంబంధించిన వాసనలతో గూడియే యుండును.
"జాతస్య హి ధ్రువో మృత్యు:ధృవం జన్మ మృతస్య చ "అన్నట్లు అజ్ఞాన దశలో నున్నoతవరకుజననమరణములు ఎవరికిని తప్పవు.రానున్నజన్మలన్నియు పూర్వకర్మలఫలములే.మానవుడు మాసిన చొక్కాను విడిచి కొత్త చొక్కాను తోడుగుకున్నట్లే జీర్ణ శరీరమును విడిచికొత్త శరీరమును గైకొనుచుండును. ఒకే శరీరమునకు బాల్యము,యౌవనము,కౌమారము,వార్ధక్యము అను దశలు మారుచున్నట్లే ఒకే జీవునకు అనేక శరీరములు మారుచుండును.శరీరము అనిత్యము.జీవుడు నిత్యము.భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత జన్మలో పుణ్యకార్యములు చేసిభగవత్పాత్రులు కావలెను.అదియే జీవునిముఖ్య ప్రయత్నము.మనమెంత తపము చేసినను పుణ్యకార్యములు చేయకున్నమనము జననమరణాదులలో తిరుగుదము.
"బ్రహ్మణ్యాధాయకర్మాణి సంగం త్యక్త్వా కరోతి య:
అని భగవద్గీతలొ చెప్పినట్లుగా కర్మల వలన కల్గులాభములను ,చేసిన కర్మములన్నిటినిఆసక్తిరహితముగా కర్మలనాచరించినవానినిపాపములు తామరాకుపై నీటిబిందువులవలెఅంటవు. రామాయణం లో సీతపరిత్యాగము తరువాతఅగస్త్యాశ్రమమునకు వచ్చినపుడు ఆ ముని రామునకు కానుకగా ఒక మనిభూషనిచ్చెను. ఆ మణి భూష వృత్తాంతమును తెలుపుమని యడుగగా ఆముని క్రిందివిధాన చెప్పెను.తాను కృతయుగములో తపమునకనువైన ప్రదేశముగురించి వెదుకుచుండగ నొక నిర్జనారణ్యమున కొలను పక్క ఆశ్రమమును చూచి అక్కడనొక దేహమునుచూచితిని.ఇంతలోనొక దివ్య పురుషుడు గగనమార్గమున వచ్చి ఆ దేహమును కోసి మాంసమును తిని కొలనులో నీరు త్రాగుచుండగా నతనిని అడిగితిని .విచిత్రమేమనగా అతడుతిన్నా ఆ మృత దేహము మామూలుగానైనది.ఆ పురుషుడిట్లనెను.ఓ మునీశ్వరా!సుదేవుడనే విడర్భరాజుకుమారుడునగుశ్వేతుడనునా తండ్రీ తరువాత మనోరంజకముగా ప్రజపాలనచేసి వైరాగ్యముకలుగ నాతమ్మునికి రాజ్యపాలన యిచ్చి తపమును చేసి స్వర్గమునకు వెళ్ళితిని.అక్కడ నాకు బాగా ఆకలి వేయుచుండగా బ్రహ్మను కారణము నడుగగా బ్రహ్మ ఇట్లు చెప్పెను.ఓ రాజా! నీవు ప్రజాపాలనచేసినపుడు ఎవరికిని అన్నము పెట్ట లేదు.దాహార్తులకు నీరివ్వలేదు.నీవు తపస్సు వల్ల దేవత్వం పొందినావు.ఎంత తపముచేసినాను అన్నదానఫలమునకు సాటిరావు.ఆశ్రమంగా అర్ధులకు అన్నదానంచెయ్యగలస్దితిలోనున్నప్పటికి నీవు చెయ్యలేదు.అందుకే ఆకలికి అలమటిస్తున్నావు.నిత్యమూ నీవు భూలోకానికి వెళ్లి నీవు విడిచిన కళేబరమును కోసి మాంసమును తినుము.ఎంతతిన్నా ఆ శరీరము కొత్తగానుండును.కొంతకాలానికి అగస్త్యుడు వస్తాడు.అతనితో మాట్లాడినపుడు శవమాంసమును తినే దశ తప్పుతుంది అని .అతడు నాకు మనిభూషనివ్వగా అతనిశావము మాయమయ్యెను.మీరుధరిస్తే అతడు శాశ్వతబ్రహ్మ లోక నివాసమును పొందగలడు.అని ముని రామునికి చెప్పెను.
పైదానిని బట్టి చేసినకర్మ ఎలాంటి వారికైనా అనుభవించకతప్పదని తెలియ చున్నది.కాన ప్రతిమానవుడు ఫలాపేక్ష,లేకుండా నిస్స్వార్ధతతో మంసికార్యములు చేసి భగవంతుని జేరునని యాసిద్దాము.
(తిరుపతి --తిరుమల దేవస్దానము వారు ప్రచురించిన హిందూ ధర్మపరిచయమను గ్రంధమాధారము)
27, జనవరి 2017, శుక్రవారం
లాలిపాట
లాలిపాట
జో అచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామగోవింద .
నందునింటను జేరి నయము మీరంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
అందముగా వారిండ్ల ఆడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ
అంగజుని గన్న మాయన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు పొంగుచున్నారా
ముంగిటనాడరా --మోహనాకార
గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసు పడగొట్టి
నీవు మధురాపురము నెల చేపట్టి
ఠీవితో నేలిన దేవకీ పట్టి
అంగుగా తాళ్ళపాక న్నయ్య చాల
శృంగార రచనగా చెప్పే నీ జోల
సంగతిగ సకల సంపదల నీ వేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
జో అచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామగోవింద .
నందునింటను జేరి నయము మీరంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
అందముగా వారిండ్ల ఆడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ
అంగజుని గన్న మాయన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు పొంగుచున్నారా
ముంగిటనాడరా --మోహనాకార
గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసు పడగొట్టి
నీవు మధురాపురము నెల చేపట్టి
ఠీవితో నేలిన దేవకీ పట్టి
అంగుగా తాళ్ళపాక న్నయ్య చాల
శృంగార రచనగా చెప్పే నీ జోల
సంగతిగ సకల సంపదల నీ వేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
ఉగ్గుపాట
అన్నమాచార్యులు రచించిన ఉగ్గుపాట
మన పెద్దలు గత రోజులలో శిశువులకు ఉగ్గుపాలు పట్టుచు క్రిందిపాట పాడెడివారు.ఇప్పుడు అవి కనుమరుగవుతున్నాయి.
ఉగ్గు పెట్టరే వో యమ్మా చె
య్యొగ్గీ నిదె శిశువో యమ్మా
కడుపులోని కమ్మలు కదలీ
నొడలూచకురే వో యమ్మా
తొడికెడి సరుగన తొలగతీయరే
వుడికెడి పాలివి వో యమ్మా
చప్పలు వట్టుక సన్నపు బాలుని
నుప్పర యెత్తకురోయమ్మా
అప్పుడె సకలము నది మీనోరనె
వొప్పదు తియ్యరె వో యమ్మా
తొయ్యలు లిటు చేతుల నలగించక
వుయ్యల నిడరే వో యమ్మా
కొయ్యమాటలనుకొండల తిమ్మని
ఒయ్యన తిట్టకు రోరమ్మా
జీవుడు-భగవంతుడు 2
(contd )
అచ్చే ద్యో య మదాహ్యోయమక్లేద్యో శోష్య ఏవ చ,
నిత్యస్సర్వగతః స్ధాణు అని చెప్పుచున్నది.సనాతనః
జీవాత్మ కత్తి మున్నగు వానిచే నరకబడడు.జీవుని అగ్నిచే కాల్చుటకును,నీటిచే తడుపుటకును,గాలిచే నార బెట్టుటకునుశక్యముగాదు.గీతజీవుడునిత్యుడు,సర్వగతుడు,స్ధాణువు,చలనములేనివాడు,సనాతనుడు అని చెప్పుచున్నది..
అనాదిగా సంక్రమించిన అజ్ఞానము అవిద్య యనబడును.అవిద్యచే ఆవరించబడిన జీవుడు సంసారములోతగుల్కొనిజననమరణములకులోనగుచున్నాడు. అట్టివాడు తన దివ్యత్వమును మఱచినాడు.జడమైన శరీరమున ప్రవేశించి చావు పుట్టుకలకులోనైనాడు.కామక్రోధాదులాతనిని బాధించుచున్నవి.అవిద్య ఎట్లు జీవునిని లోబరచుకొంది ఎవరికినితెలియదు.కానిదానినిజ్ఞానముచేతొలగించుకోనవచ్చును. జ్ఞానసంపన్నుడైన జీవుడు దేవుని సన్నిధికి జేరును.ఆ పై సంసారమతనిని బంధింపదు.దీనిని బట్టి చూడగా అవిద్యకు లోనైనవారు బద్ధజీవులనియు, దానినుండి విడివడినవారుముక్త జీవులనియు చెప్పుటకు సందేహ పడనవసరము లేదు.
జీవుడు-భగవంతుడు -1
జీవుడు --భగవంతుడు
భగవంతుడన్న పదానికి పర్యాయపదాలు -ఈశ్వరుడు ,పరమపురుషుడు,దేవుడుపురుషోత్తముడుమొ ||నవి.మనము ఎంతమంది దేవుళ్ళున్నవారినారాధించిన ఆ పూజలు ఆ సమస్త దేవుళ్లలోఆంతర్యామిగ నున్న పరమేశ్వరుడొక్కనికే చెందును.ఏకమేవా ద్వితీయం బ్రహ్మ -మొ||గు వేదవచనములు ఈసత్యమునేచెప్పుచున్నవి.భగవంతుడుసకలకల్యాణములకునిలయము. ఎట్టి దోషమతనియందు లేదు.సమస్తజీవుల హృదయాంతరాలలోపరమేశ్వరుడున్నాడు.ఆయన సంకల్పముతోనే సృష్టిస్ధితి లయములు జరుగుచున్నవి .తేన వినా తృణమపిన చలతి.అన్నట్లు భగవంతుని సంకల్పము లేక గడ్డి పోచయు కదలదు.సత్యము,జ్ఞానము,ఆనందము మున్నగునవి భగవంతుని లక్షణములుగా వేదాలన్నీ చెబుతున్నాయి.ఇతనికెట్టి వికారములులేవు.అందుచే నితనిని నిర్వికారుడనబడుచున్నాడు. ఎట్టి దోషములు లేవు గాన నిర్మలుడు.సమస్త లోకములు అతనిలోనే యునికిని కల్గియున్నవి.కాలచక్రములోనిజీవులందరుముక్తినొందువరకుఈ విశ్వలీలఇట్లు సాగుచునే యుండును.భగవంతుడు దయామయుడు.కనుకనే లోకరక్షణకై దుష్టులను శిక్షించుచు నిగ్రహానుగ్రహాలను పాటించుచు జననీజనక రూపమున ఈ రెండుగుణాలనుచూపుచున్నాడు.భక్తులఆరాధనలనందుకోడానికిఅవతారాల నెత్తు చున్నాడు.ఒక జీవకోటికే గాకసమస్త ప్రాణికోటికి సద్గతిని సమకూర్చుటకేర్పడినవి.
జీవుడులేకజీవాత్మశరీరముకంటెభిన్నముగానున్నాడు.పృధివి,జలము,తేజస్సు,వాయువు,ఆకాశము అను పంచ భూతాలతో స్ధూలశరీరమునిర్మించబడినది.చర్మం,చక్షువు,శ్రోత్రము,జిహ్వ, ఘ్రాణము అను ఐదును జ్ఞానేంద్రియములు.జీవుడు వీని కంటె వేఱుగనున్నాడు.శరీరమునందుప్రాణము,అపానము,వ్యానము,ఉదానము,సమానము అను పంచ వాయువులుగలవు.జీవుడు ఆ వాయువులకంటెభిన్నుడు.మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అను వానితో గూడినసూక్ష్మ శరీరము గూడా జీవుడు కాడు. చావు పుట్టుకలు దేహమునకే గాని జీవునకు లేవు.కాన జీవుడు నిత్యుడని పిలువబడుచున్నాడు,జ్ఞానము జీవునకు ముఖ్యలక్షణము.మేలుకొని యున్నప్పుడు మనము బాహ్య ప్రపంచమునకుసంబంధించినజ్ఞానముగల్గియుండును.అప్పుడు ఐదు జ్ఞానేంద్రియములు పనిచేయుచుండును.అందుచే కనులతో చూచుట,చెవులతో వినుట,మున్నగు పనులు చేయగల్గు చున్నాము.స్వప్నావస్ధలో మనకు బాహ్య ప్రపంచ జ్ఞానముండదు.అపుడు జీవుడు మానసికముగా మాత్రమే సుఖదు:ఖములనుఅనుభవించు చుండును. గాఢ నిద్రలో మనస్సు గూడ పనిచేయదు.అపుడు జీవుడు పూర్తివిశ్రాంతి తీసుకొనును.
"మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః"అనుగీత వచనానుసారము భగవంతుని అంశయే జీవలోకమునందు సనాతన జీవుడుగానయ్యెనని తెలియచున్నది.దేశమునకు ,కాలమునకు అతీతుడైన జీవుడు సర్వకాల సర్వావస్ధలలో ఎట్టిమార్పులకు లోనుగాడు.రాయి,కొయ్య మొదలగు పదార్ధాలు వలె జీవుడు జడ స్వరూపుడుగాడు.(CONTD)
జీవుడులేకజీవాత్మశరీరముకంటెభిన్నముగానున్నాడు.పృధివి,జలము,తేజస్సు,వాయువు,ఆకాశము అను పంచ భూతాలతో స్ధూలశరీరమునిర్మించబడినది.చర్మం,చక్షువు,శ్రోత్రము,జిహ్వ, ఘ్రాణము అను ఐదును జ్ఞానేంద్రియములు.జీవుడు వీని కంటె వేఱుగనున్నాడు.శరీరమునందుప్రాణము,అపానము,వ్యానము,ఉదానము,సమానము అను పంచ వాయువులుగలవు.జీవుడు ఆ వాయువులకంటెభిన్నుడు.మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అను వానితో గూడినసూక్ష్మ శరీరము గూడా జీవుడు కాడు. చావు పుట్టుకలు దేహమునకే గాని జీవునకు లేవు.కాన జీవుడు నిత్యుడని పిలువబడుచున్నాడు,జ్ఞానము జీవునకు ముఖ్యలక్షణము.మేలుకొని యున్నప్పుడు మనము బాహ్య ప్రపంచమునకుసంబంధించినజ్ఞానముగల్గియుండును.అప్పుడు ఐదు జ్ఞానేంద్రియములు పనిచేయుచుండును.అందుచే కనులతో చూచుట,చెవులతో వినుట,మున్నగు పనులు చేయగల్గు చున్నాము.స్వప్నావస్ధలో మనకు బాహ్య ప్రపంచ జ్ఞానముండదు.అపుడు జీవుడు మానసికముగా మాత్రమే సుఖదు:ఖములనుఅనుభవించు చుండును. గాఢ నిద్రలో మనస్సు గూడ పనిచేయదు.అపుడు జీవుడు పూర్తివిశ్రాంతి తీసుకొనును.
"మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః"అనుగీత వచనానుసారము భగవంతుని అంశయే జీవలోకమునందు సనాతన జీవుడుగానయ్యెనని తెలియచున్నది.దేశమునకు ,కాలమునకు అతీతుడైన జీవుడు సర్వకాల సర్వావస్ధలలో ఎట్టిమార్పులకు లోనుగాడు.రాయి,కొయ్య మొదలగు పదార్ధాలు వలె జీవుడు జడ స్వరూపుడుగాడు.(CONTD)
16, జనవరి 2017, సోమవారం
కధ
చిన్నకధ
రవికిరణ్ అనే వాడు చిన్నప్పుడు చాలా కష్టాలు పడిన సమయంలో భారత దేశానికి మహాత్మాగాంధీజీ స్వతంత్రత యిచ్చినందుకుగాను అతని బొమ్మనునోటుపైనగానికార్యాలయలలోగాని,ముద్రించడము,నిర్మించడము జరుగుతోంది. ఇప్పటికి రవి అప్పటికాంగ్రెస్సు ను గౌరవిస్తూ తానుRSSలో నుండి వారి సహకారముతో ఆ దేశానికి నాయకునిగానెన్న బడి నప్పుడు ఆ కాంగ్రెస్సునుతిడుతున్నాడు.ఇప్పటివరకుమతసహనమన్నపేరునుకల్గినదేశమునమతమార్పిడులనుచేయిస్తూప్రజలనుమభ్యపెడుతూ,ప్రజలకష్టాలనుతొ లగించకతనమాటే నెగ్గాలని ప్రజలు తనకు సహకరిస్తున్నారని ప్రసంగాలు చేస్తూ పెద్దనోట్లురద్దుకార్యక్రమా న్ని ప్రారంభించి ప్రజలనిబ్బందిపెడుతూ పాలన సాగించడ మెంత సబబొఆలోచించక అతనినే పొగడ డమెంత సబబోగ్రహించగలరు.ప్రజాహక్కులను భంగపరచు టఅతని స్వభావమా?తానే ఏకైక నాయకునిగా గర్వపడితే తనవినాశమును కోరుకున్నట్లే. ఇదంతా చూస్తే అతని స్వార్ధము బయటపడ్తోంది.అదే సాధరణ పౌరుడుస్వార్ధంతో ప్రవర్తిస్తే శిక్షిస్తుంటే పెద్దవారు,ధనవం తులు మిక్కిలి స్వార్ధముతో సామాన్య ప్రజలను లెక్కజేయక వారిని వారి సంపదలను ఏదోరకముగా దోస్తూ రాక్షసత్వముగా ప్రవర్తిస్తున్నారు.ఇది స్వార్ధ మహిమయే గదా! స్వార్ధాన్ని ప్రతిమానవుడు అంటే సమాన్య్డు ధనవంతుడు అనే తేడా లేకుండా మనమందరమూ వేర్వేరుమతాలవారమైన,వేర్వేరుకులాలవారమైన ,వేర్వేరు భాష లుమాట్లాడే వారమైన,సమానముల మేయనిభావించి స్వార్ధములేకుండా పరస్పర సహకారముచేసుకుంటూ ఉంటె ఈ పరిస్ధితి రాదు గదా ?మనదెశాన్నీతర దేశాలకు బానిస కాకుండా నిస్స్వార్ధపరులే చూడగలరు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)