కవితా వైచిత్రి
. క్రింది పద్యములో ప్రత్యుత్తరాలుండటంరెండుప్రశ్నలకొక్కటే చిత్రంగా సమాధానం కావటం విశేషాలు.
ఎద్దీ శునకశ్వoబగు?-కృషిని లెద్దానివాంఛింతురెల్లయప్డు ?
విడెమునెద్దాననొక్కంగగడగునరుడు? "పంట"నని యుత్తరము చెప్పువాడ,సఖుడ!
ప్ర :1 .ఏది (ఎద్ది)ఈశ్వరునికి వాహనమగునవి?
జ:ఎద్దు -శివుని వాహనము.
ప్ర 2.కర్షకులు అన్ని వేళల యందు దీనిని కోరుకొందురు?
ప్ర 3..మానవుడు .తాంబూలమును (వక్కాకును,విడెమును)దేనితో నొక్కి కోరుకును?
పై రెండు ప్రశ్నలకు పంటన్ -అనునది ఒక్కటే సమాధానము.ఎలా?-రైతులు పంటనే కోరుకొందురు.
నరుడు తాంబూలమును దంతములతో (పన్నులతో,పంటన్).కొరుకునుగదా .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి