క్రింది పద్యమును పరిశీలన చేసిన పది ప్రశ్నలు కనబడును.వానికన్నింటికిఒకేపదము(రెండక్షరాలుగలది)సమాధానమగును.ఇది నియమము.
సీ.ఏకచక్రమునెక్కురేబెవ్వడు2ఒడలెల్లగనులైనయెడయ డెవడు?
3.మఱ్ఱి యాకున బండు కుఱ్ఱ వాడెవ్వడు?4.శివుని యౌదల జేరి చెలగునెవడు ?
5.సమతమై సర్వ భూతముములనేలునెవడు?6.వాయు
భక్షణచేసిబ్రతుకునేది?
7.అఖిల జివనంబులకాధారమగునేది?8.కొమరార మారుని
గుఱ్ఱమేది?
9.కంధి చాటి లంక గాల్చిన మృగమేది?10.క్షితిని జల్లబడగ
జేయునేది?
ఈ నియమాన్ని అనుసరించి (హరి)అనునదొక్కటేసమాధా నమగును.
1.ఒకే చక్రము గల బండినెక్కి తిరుగు వాడెవ్వడు?
హరి (సూర్యుడు)
2.దేహమునిండాకన్నులు గలవాడెవడు ?
హరి(దేవేంద్రుడు )
3.మఱ్ఱి యాకుపై పరుండు బాలుడెవడు?
హరి(కృష్ణుడు)
4.శివుని శిరస్సుపై ప్రకాశించు వాడెవడు?
హరి (చంద్రుడు)
5.సర్వ ప్రాణులను సమానంగా పాలించు వాడెవ్వడు?
హరి (యముడు)
6.గాలిని మేసి బ్రతుకునేది?--హరి (పాము)
7.సర్వ ప్రాణులకు ముఖ్యాధారమేది?--హరి (గాలి)
8.మదనునకు సుందర వాహనమేది?--హరి (చిలుక)
9.సాగరం దాటి లంకా దహనము చేసిన మృగమేది?
హరి (కోతి)(హనుమంతుడు)
10.భూమిని చల్లబడునట్లు చేయునదేది?--హరి (వాన)
హరి శబ్దానికి నానార్ధాలు :
యమానిలేంద్రచంద్రాదర్క విష్ణు సింహాం శువాజిషు !
శుకాహికపిభేకేషుహరిర్నా,కపిలేత్రిషు (అ.కో.)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి