జీవుడు --భగవంతుడు
భగవంతుడన్న పదానికి పర్యాయపదాలు -ఈశ్వరుడు ,పరమపురుషుడు,దేవుడుపురుషోత్తముడుమొ ||నవి.మనము ఎంతమంది దేవుళ్ళున్నవారినారాధించిన ఆ పూజలు ఆ సమస్త దేవుళ్లలోఆంతర్యామిగ నున్న పరమేశ్వరుడొక్కనికే చెందును.ఏకమేవా ద్వితీయం బ్రహ్మ -మొ||గు వేదవచనములు ఈసత్యమునేచెప్పుచున్నవి.భగవంతుడుసకలకల్యాణములకునిలయము. ఎట్టి దోషమతనియందు లేదు.సమస్తజీవుల హృదయాంతరాలలోపరమేశ్వరుడున్నాడు.ఆయన సంకల్పముతోనే సృష్టిస్ధితి లయములు జరుగుచున్నవి .తేన వినా తృణమపిన చలతి.అన్నట్లు భగవంతుని సంకల్పము లేక గడ్డి పోచయు కదలదు.సత్యము,జ్ఞానము,ఆనందము మున్నగునవి భగవంతుని లక్షణములుగా వేదాలన్నీ చెబుతున్నాయి.ఇతనికెట్టి వికారములులేవు.అందుచే నితనిని నిర్వికారుడనబడుచున్నాడు. ఎట్టి దోషములు లేవు గాన నిర్మలుడు.సమస్త లోకములు అతనిలోనే యునికిని కల్గియున్నవి.కాలచక్రములోనిజీవులందరుముక్తినొందువరకుఈ విశ్వలీలఇట్లు సాగుచునే యుండును.భగవంతుడు దయామయుడు.కనుకనే లోకరక్షణకై దుష్టులను శిక్షించుచు నిగ్రహానుగ్రహాలను పాటించుచు జననీజనక రూపమున ఈ రెండుగుణాలనుచూపుచున్నాడు.భక్తులఆరాధనలనందుకోడానికిఅవతారాల నెత్తు చున్నాడు.ఒక జీవకోటికే గాకసమస్త ప్రాణికోటికి సద్గతిని సమకూర్చుటకేర్పడినవి.
జీవుడులేకజీవాత్మశరీరముకంటెభిన్నముగానున్నాడు.పృధివి,జలము,తేజస్సు,వాయువు,ఆకాశము అను పంచ భూతాలతో స్ధూలశరీరమునిర్మించబడినది.చర్మం,చక్షువు,శ్రోత్రము,జిహ్వ, ఘ్రాణము అను ఐదును జ్ఞానేంద్రియములు.జీవుడు వీని కంటె వేఱుగనున్నాడు.శరీరమునందుప్రాణము,అపానము,వ్యానము,ఉదానము,సమానము అను పంచ వాయువులుగలవు.జీవుడు ఆ వాయువులకంటెభిన్నుడు.మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అను వానితో గూడినసూక్ష్మ శరీరము గూడా జీవుడు కాడు. చావు పుట్టుకలు దేహమునకే గాని జీవునకు లేవు.కాన జీవుడు నిత్యుడని పిలువబడుచున్నాడు,జ్ఞానము జీవునకు ముఖ్యలక్షణము.మేలుకొని యున్నప్పుడు మనము బాహ్య ప్రపంచమునకుసంబంధించినజ్ఞానముగల్గియుండును.అప్పుడు ఐదు జ్ఞానేంద్రియములు పనిచేయుచుండును.అందుచే కనులతో చూచుట,చెవులతో వినుట,మున్నగు పనులు చేయగల్గు చున్నాము.స్వప్నావస్ధలో మనకు బాహ్య ప్రపంచ జ్ఞానముండదు.అపుడు జీవుడు మానసికముగా మాత్రమే సుఖదు:ఖములనుఅనుభవించు చుండును. గాఢ నిద్రలో మనస్సు గూడ పనిచేయదు.అపుడు జీవుడు పూర్తివిశ్రాంతి తీసుకొనును.
"మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః"అనుగీత వచనానుసారము భగవంతుని అంశయే జీవలోకమునందు సనాతన జీవుడుగానయ్యెనని తెలియచున్నది.దేశమునకు ,కాలమునకు అతీతుడైన జీవుడు సర్వకాల సర్వావస్ధలలో ఎట్టిమార్పులకు లోనుగాడు.రాయి,కొయ్య మొదలగు పదార్ధాలు వలె జీవుడు జడ స్వరూపుడుగాడు.(CONTD)
జీవుడులేకజీవాత్మశరీరముకంటెభిన్నముగానున్నాడు.పృధివి,జలము,తేజస్సు,వాయువు,ఆకాశము అను పంచ భూతాలతో స్ధూలశరీరమునిర్మించబడినది.చర్మం,చక్షువు,శ్రోత్రము,జిహ్వ, ఘ్రాణము అను ఐదును జ్ఞానేంద్రియములు.జీవుడు వీని కంటె వేఱుగనున్నాడు.శరీరమునందుప్రాణము,అపానము,వ్యానము,ఉదానము,సమానము అను పంచ వాయువులుగలవు.జీవుడు ఆ వాయువులకంటెభిన్నుడు.మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అను వానితో గూడినసూక్ష్మ శరీరము గూడా జీవుడు కాడు. చావు పుట్టుకలు దేహమునకే గాని జీవునకు లేవు.కాన జీవుడు నిత్యుడని పిలువబడుచున్నాడు,జ్ఞానము జీవునకు ముఖ్యలక్షణము.మేలుకొని యున్నప్పుడు మనము బాహ్య ప్రపంచమునకుసంబంధించినజ్ఞానముగల్గియుండును.అప్పుడు ఐదు జ్ఞానేంద్రియములు పనిచేయుచుండును.అందుచే కనులతో చూచుట,చెవులతో వినుట,మున్నగు పనులు చేయగల్గు చున్నాము.స్వప్నావస్ధలో మనకు బాహ్య ప్రపంచ జ్ఞానముండదు.అపుడు జీవుడు మానసికముగా మాత్రమే సుఖదు:ఖములనుఅనుభవించు చుండును. గాఢ నిద్రలో మనస్సు గూడ పనిచేయదు.అపుడు జీవుడు పూర్తివిశ్రాంతి తీసుకొనును.
"మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః"అనుగీత వచనానుసారము భగవంతుని అంశయే జీవలోకమునందు సనాతన జీవుడుగానయ్యెనని తెలియచున్నది.దేశమునకు ,కాలమునకు అతీతుడైన జీవుడు సర్వకాల సర్వావస్ధలలో ఎట్టిమార్పులకు లోనుగాడు.రాయి,కొయ్య మొదలగు పదార్ధాలు వలె జీవుడు జడ స్వరూపుడుగాడు.(CONTD)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి