క్రింది శ్లోకాన్ని పరిశీలిస్తే ఒకే సమాధానము వచ్చేప్రశ్నలు కనబడతాయి.
పూ:కీ దృక్ ?కా మాధవేష్టా?యతే ర్వాక్ కీ దృక్?కంపాహీ శ్వరే త్యాహ భక్తః ?
ఆదే రాదే రుద్ధృతైకైకవర్ణః శబ్దస్తేషూ త్తరo నైవమంతే |
పై దానిలో ని నాల్గు ప్రశ్నలకు "రామా రామా "ఒక్కటే సమాధానము.ఎట్లన దానిలోని మొదటి ఒక్కొక్క అక్షరాన్ని క్రమంగా తగ్గిస్తూ పోయినచో "మారామ ,రామా,మా,"గా విభాక్తములై ప్రత్యుత్తరాలగుచున్నవి.
ప్రశ్న :పట్టణముఎట్లున్నది?
జ:రామారామా =1.రామ +ఆరామా 2.రామా +ఆరామా 3.రామారామా =1.అందమైనతోటలతో గూడియున్నది.
2.సుందర భామలతోనిండిన ఉపవనాలు కలిగియున్నది.
3.అందము గల సుందరీ మణులు గల్గియున్నది.
2. విష్ణువునకు ఇష్టురాలెవరు?జ:(.రానుతగ్గింపగా)మారామా =రమాసుందరి,లక్ష్మి
3.సన్న్యాసి మాట ఎట్టిది?జ:మొదటి రా,మా,అనే రెండక్షరాలు పోగా ,మిగిలిన రా: ,మా =ధనము,వద్దు అనగా ధనాశ పనికిరాదని సన్న్యాసి భావము.
4.భక్తుడు ఎవరిని రక్షింపమనికోరును?
జ:మా (=నన్ను ).ఇది అస్మద్ శబ్దం యొక్క ద్వితీయైక వచనము .(మామ్-మా)ఆదినుండి క్రమంగా ఒక్కొక్క అక్షరం తగ్గించుటచే ,ఇది హీయమానాక్షరమైనది.
వ్యాఖ్యానం బాగుంది . ఇటువంటివి ఇంకా వ్రాయండి .
రిప్లయితొలగించండి