ullasam-
18, మార్చి 2017, శనివారం
లక్ష్మిపార్వతుల సంభాషణా పద్యం
బందరులో తిరుపతి వేంకట కవుల అష్టావధానం లో క్రింది పద్యం చెప్పబడినది
సీ ||గంగాధరుoడు నీ మగండని నవ్వoగవేష ధరుడు నీ పెన్మటనియె,
ఎద్దునెక్కును నీదునెమ్మికాడనినవ్వగ్రద్దనెక్కునునీదుమగండటనియె వల్లకాడిల్లు నీ వల్లభు నకనంగ-నడిసంద్రమిల్లు నీ నాధునకనె,
నాట్యంబు
సేయు నీ నాయకుండన -హంగు కావింషు నీ కాంతుడనియె
గీ||ముష్టికెక్కడికే కేగె నీ యిష్టుడనిన
బలి మఖంబున కేగెనో లలన!యనియె,
ఇట్టులన్యోన్య మర్మంబులెంచుకొనెడి
పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతు .
లక్ష్మి::1..పార్వతీ !నీ భర్త కావడితో నీళ్ళు మోసేవాడే!(గంగనుదాల్చినవాడే)
పార్వతి :నీ భర్త నానా వేషాలు వేసే నటుడు (అనేకావతారాలెత్తినవాడు )
లక్ష్మి:2.నీ ప్రియుడు నందినెక్కి (ముసలి ఎద్దునెక్కి)తిరుగును.
పార్వతి::నీ భర్త గ్రద్దనెక్కి తిరుగుట లేదా!
లక్ష్మి:3.నీ :ప్రియునికి శ్మశానమెయిల్లు
పార్వతి:అవును.నీ నాధుని యిల్లు నడిసముద్రమేగదా!
లక్ష్మి:4.అడుక్కోవటానికి నీ మగడెక్కడికివెళ్ళాడో ?
పార్వతి:మూడడుగుల స్ధలం కోసం అడుక్కోడానికి బలి యజ్ణ భూమికివెళ్ళాడు.
(మొత్తమ్మీద దేవ దేవేరులకు కూడా తప్పలేదు.ఈ ఎత్తిపొడుపులు)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి