అన్నదానము
పూర్వము జనాభా తక్కువగా నుండుట చేతను,మానవులలో పాపభీతి, దైవభక్తి,ఏకాగ్రత,మున్నగు సుగుణములుండుటచేకీర్తి కాముకులై దానగుణముకలిగియుండెడివారు.అన్నికులాలవారు కొద్దో,గొప్పో దానాలు చేసేవారు.బలి,కర్ణుడు,శిబి మున్నగు వారినిఉదాహరణగా గ్రహించవచ్చును.దానాలలో అన్నదానముపూర్వము నుండి ఇప్పటివరకు అనేక ఉత్సవాలలో అన్నదానము చేయుచుండుట జరుగుచున్నది.ఉత్తమ గ్రంధమైన రామాయణములో రాముడు అరణ్యవాసానంతరము పట్టాభిషిక్తుడైన హనుమంతునిని బీదసాదలకు దానం చేయమని యాదేశించినాడట.ఎన్నోదినాలు,ఎంతోఉత్సాహముతో,అన్నవస్త్రాలు దానము చేసినా అన్నమో రామచంద్రా,ఆలో లక్ష్మణాఅంటూ వచ్చిన జనం మాత్రం తగ్గలేదట.అలసిన హనుమానుడు మాత్రం వచ్చిన వాళ్ళను తర్జిస్తూ,భర్జిస్తూ,ఏ కొద్దో,గొప్పో వారి ముఖాన విసరడంతో,క్రమంగా అర్ధి జనులు ఆగిపోయారుట.దీనికిష్టపడనిరాముడోకనాడు నగరంలో తిరుగు చుండగా ,త్రోవలో ఒకవంకరమూతిగల సన్న్యాసి ఎదురు పడిన వానికి నమస్కరించి మహానుభావా!అంటా బాగానే యుంది నీకు ఆ పంది మూతిఎలావచ్చింది అనిఅడిగెనట.అప్పుడాతడుక్రింది విధంగా చెప్పెనట.
శ్లో|అన్నదానం మయా దత్తం రత్నాని వివిధానిచ
నదత్తంమధురై ర్వా క్యై :తే నాహం సూకరాన్వయ :
ఓ రామా!పూర్వజన్మలొ నేనెన్నో అన్నసంతర్పణలు చేసాను.కాని ఆ చేసే దానం భక్తిశ్రద్ధలతో,వినయవిధేయతలతో ,మంచి మాటలతో చేయలేదు.అందుచే ఈ జన్మలో నా మూతి పంది మూతి యైనది.అని చెప్పెను.దానిని రాముని వెంతయున్న ఆంజనేయుడు విని అందులోని పరమార్ధాన్ని గ్రహించి ప్రియంతోపలుకుచు భక్తితో దానం చేయడం మొదలు పెట్టాడు.దీని వలన అన్నదానమహిమ ఎంతగొప్పదో మనము గ్రహించవలెను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి