మన భారత దేశమున అనేకమతాలు గలవు.అందుకే మన దేశాన పరమతసహనమునకాలవాలము.మనది హిందూ మతము.దీని యందు కర్మ సిద్ధాంతం మిక్కిలి ప్రధానం .ప్రపంచాన కనబడే హెచ్చుతగ్గులకు,తరతమభేదాలకు కర్మ సిద్ధాంతం సరియైన సమధానమునిచ్చును .
పుట్టిన జీవులందరు ఒకే విధముగా ఎందుకు లేరు?కొందరుసుఖమును,మఱికొందరు దు:ఖమును ఎందుకు అనుభవించు చున్నారు?ఇట్టి గడ్డు సమస్యలను కర్మ సిద్ధాంత మొక్కటే పరిష్కరించగలదు.
కారణములేకకార్యముండదు.అనే నియమముపై కర్మ సిద్ధాంతమాధారపడియున్నది.జీవులనుభవించుసుఖమునకైనను,దు:ఖమునకైననువారుపూర్వమాచరించినకర్మలేకారణము.సుకృతమొనర్చినవాడు సుఖమును,దుష్కృతమొనర్చినవాడు దు:ఖమును పొందితీరును.ఏ బీజమును నాటెదమో దాని ఫలమునే అనుభవింతుము కాని వేరే ఫలమును పొందలేముకదా .అటులనే మనము ఎట్టి కర్మ చేయుదుమో అట్టి ఫలమునే అనుభవింతుమనికర్మసిద్ధాంతము చెప్పుచున్నది .
ముందటి జన్మలో చేసిన కర్మలు గూడ ఈ జన్మలో ఫలించు చుండును.అలాగే ఈ జన్మలో చేసిన కర్మలు మరుసటి జన్మలో అనుభవానికివచ్చుటయుగలదు.ఆరోగ్యము,దీర్ఘజీవితము,సంపద,కీర్తి,అధికారముమున్నగునవిపుణ్యకర్మలచేకలుగుఫలములు.రోగము,అకాలమరణము ,బీదరికము మున్నగు దుష్ఫలములుపాపకర్మలచే కల్గును.జ్ఞానోదయమగునంతవరకు ఈ కర్మఫలములు నీడవలె జీవులను వెన్నాడుచునేయుండును.భగవద్గీతలో "జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కురుతే తధా" చెప్పినట్లుగా జ్ఞానమనెడి వహ్ని సమస్త కర్మలను దహించుచున్నది.జ్ఞానవంతులై భగవత్సన్నిధి కి జేరిన ముక్త జీవులకికకర్మతో ఎట్టి సంపర్కము లేదు.
కర్మానుగుణముగా జీవులకు పునర్జన్మ గల్గును.మానవుడు మరణిస్తే స్ధూల శరీరము మాత్రమే నశించును.సూక్ష్మశరీరము పూర్వకర్మలకు సంబంధించిన వాసనలతో గూడియే యుండును.
"జాతస్య హి ధ్రువో మృత్యు:ధృవం జన్మ మృతస్య చ "అన్నట్లు అజ్ఞాన దశలో నున్నoతవరకుజననమరణములు ఎవరికిని తప్పవు.రానున్నజన్మలన్నియు పూర్వకర్మలఫలములే.మానవుడు మాసిన చొక్కాను విడిచి కొత్త చొక్కాను తోడుగుకున్నట్లే జీర్ణ శరీరమును విడిచికొత్త శరీరమును గైకొనుచుండును. ఒకే శరీరమునకు బాల్యము,యౌవనము,కౌమారము,వార్ధక్యము అను దశలు మారుచున్నట్లే ఒకే జీవునకు అనేక శరీరములు మారుచుండును.శరీరము అనిత్యము.జీవుడు నిత్యము.భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత జన్మలో పుణ్యకార్యములు చేసిభగవత్పాత్రులు కావలెను.అదియే జీవునిముఖ్య ప్రయత్నము.మనమెంత తపము చేసినను పుణ్యకార్యములు చేయకున్నమనము జననమరణాదులలో తిరుగుదము.
"బ్రహ్మణ్యాధాయకర్మాణి సంగం త్యక్త్వా కరోతి య:
అని భగవద్గీతలొ చెప్పినట్లుగా కర్మల వలన కల్గులాభములను ,చేసిన కర్మములన్నిటినిఆసక్తిరహితముగా కర్మలనాచరించినవానినిపాపములు తామరాకుపై నీటిబిందువులవలెఅంటవు. రామాయణం లో సీతపరిత్యాగము తరువాతఅగస్త్యాశ్రమమునకు వచ్చినపుడు ఆ ముని రామునకు కానుకగా ఒక మనిభూషనిచ్చెను. ఆ మణి భూష వృత్తాంతమును తెలుపుమని యడుగగా ఆముని క్రిందివిధాన చెప్పెను.తాను కృతయుగములో తపమునకనువైన ప్రదేశముగురించి వెదుకుచుండగ నొక నిర్జనారణ్యమున కొలను పక్క ఆశ్రమమును చూచి అక్కడనొక దేహమునుచూచితిని.ఇంతలోనొక దివ్య పురుషుడు గగనమార్గమున వచ్చి ఆ దేహమును కోసి మాంసమును తిని కొలనులో నీరు త్రాగుచుండగా నతనిని అడిగితిని .విచిత్రమేమనగా అతడుతిన్నా ఆ మృత దేహము మామూలుగానైనది.ఆ పురుషుడిట్లనెను.ఓ మునీశ్వరా!సుదేవుడనే విడర్భరాజుకుమారుడునగుశ్వేతుడనునా తండ్రీ తరువాత మనోరంజకముగా ప్రజపాలనచేసి వైరాగ్యముకలుగ నాతమ్మునికి రాజ్యపాలన యిచ్చి తపమును చేసి స్వర్గమునకు వెళ్ళితిని.అక్కడ నాకు బాగా ఆకలి వేయుచుండగా బ్రహ్మను కారణము నడుగగా బ్రహ్మ ఇట్లు చెప్పెను.ఓ రాజా! నీవు ప్రజాపాలనచేసినపుడు ఎవరికిని అన్నము పెట్ట లేదు.దాహార్తులకు నీరివ్వలేదు.నీవు తపస్సు వల్ల దేవత్వం పొందినావు.ఎంత తపముచేసినాను అన్నదానఫలమునకు సాటిరావు.ఆశ్రమంగా అర్ధులకు అన్నదానంచెయ్యగలస్దితిలోనున్నప్పటికి నీవు చెయ్యలేదు.అందుకే ఆకలికి అలమటిస్తున్నావు.నిత్యమూ నీవు భూలోకానికి వెళ్లి నీవు విడిచిన కళేబరమును కోసి మాంసమును తినుము.ఎంతతిన్నా ఆ శరీరము కొత్తగానుండును.కొంతకాలానికి అగస్త్యుడు వస్తాడు.అతనితో మాట్లాడినపుడు శవమాంసమును తినే దశ తప్పుతుంది అని .అతడు నాకు మనిభూషనివ్వగా అతనిశావము మాయమయ్యెను.మీరుధరిస్తే అతడు శాశ్వతబ్రహ్మ లోక నివాసమును పొందగలడు.అని ముని రామునికి చెప్పెను.
పైదానిని బట్టి చేసినకర్మ ఎలాంటి వారికైనా అనుభవించకతప్పదని తెలియ చున్నది.కాన ప్రతిమానవుడు ఫలాపేక్ష,లేకుండా నిస్స్వార్ధతతో మంసికార్యములు చేసి భగవంతుని జేరునని యాసిద్దాము.
(తిరుపతి --తిరుమల దేవస్దానము వారు ప్రచురించిన హిందూ ధర్మపరిచయమను గ్రంధమాధారము)
వ్యాసము చాల బాగున్నది.
రిప్లయితొలగించండి