అత్తారిల్లు
అత్తారిల్లుఅంటేచాలామందికియిష్టముగను,యిష్టముగను,భయంగాను కనబడుతుంది.చాలామంది తమభార్యలపై ప్రేమతో అత్తవారింటఉండటానికి సిధ్ధ.మౌతారు.అట్టివారు తమ అభిప్రాయాలను క్రింది శ్లోకంలో తెలియ బరచినారో గమనించండి..
శ్లో.శ్వశురగృహనివాసఃస్వర్గతుల్యోనరాణాం
యదిభవతిరిద్రో పంచవాషడ్దినాని
దధి మధు ఘృత లోభాత్ మాసమేకం .వసేత్ చేత్ తదుపరి దినమేకం పాదరక్షా ప్రయోగః
అత్తవారిల్లు ఎట్టిది?అను ప్రశ్నకు సమాధానము పై శ్లోకంలో దర్శనీయమగు చున్నది.
ఒక మామ గారింట్లో నల్గురుఅల్లుళ్లు ఉన్నారు.ఒకేసారి మను గుడుపు (వివాహానంతరం అత్త వారింట్లోఅల్లుళ్ళకుచేసేవిందు) ల కోసం వచ్చినారట.ఎంతధనం, ఓపిక,ప్రేమ గలవారైనా ,ఎంత బాగా పెట్టాలనుకున్నా ,ఎంతకాలమని ,అల్లుళ్ళకు తినుబండారాలు,సేవలు చేయగలరు?వారికి మాత్రము విసుగు పుట్టదా?ఇలా ప్రతిదినం పీకలవరకుమెక్కి ,మేలమాడుకుంటున్న సమయంలో ఒకరికి బుధ్ధి వచ్చి ,అత్తవారిల్లు అన్నీ విధాలా స్వర్గసుఖాలలో ఓలలాడి స్తుంది అనే అర్ధం వచ్చు పై శ్లోకంలోని ప్రధమపాదo అత్తవారింటగోడపై వ్రాసి వెళ్ళేనట. .మరి కొన్ని రోజులకు రెండవ వానికి బుధ్ధి వచ్చి ,అత్త వారిల్లు ఎంత స్వర్గసీమయైన 5,6రోజులకంటే మించి యుండరాదను అర్ధము వచ్చేటట్లు రెండవపదాన్ని గోడపై వ్రాసివెళ్ళేనట.
మరికొన్ని రోజులు మెక్కి అజీర్ణం తెచ్చుకొన్న మూడవ వాడుఅత్తవారింటఅనాయాసంగాపెరుగు,పాలు,పిoడివంటలు వడ్డిస్తున్నారను అర్ధము వచ్చేటట్లు మూడవపాదాన్ని వ్రాసి మాయమైనాడట.ఇక నాలుగవవాడు మాత్రం,తిని,తేపి , వారిమీద పెత్తనం కూడా చేస్తూ ,అవి కావాలి,ఇవి కావాలి అని అధికారం చెలాయించడంతో ,పాపం ఎంత బావమరుదులైన ఏమి చేస్తారు?ఎంతకాలమని భరిస్తారు? ఏమి చేయునది లేక కోపముతోచెప్పుతో నెత్తి మీది బొచ్చు ఊడేటట్లునాలుగు దెబ్బలుకొట్టారట.దానితో ఆ నాలుగవవాడు పారిపోతూ,ఆదర బాదరగా తిండి మీది ఆశతో నెలల తరబడి తిష్టవేస్తే ,ఆ తర్వాతచెప్పు దెబ్బలు తప్పవు అనే అర్ధం కల నాల్గవ పాదం వ్రాసి పారిపోయాడు.
దీనినిబట్టి ఎంత ఆశపోతు,attతిండిపోతులైనా, అత్త వారింట్లో ఎక్కువ రోజులుండరాదని భావం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి