31, జనవరి 2017, మంగళవారం

కర్మ

                                            కర్మ

     మన భారత దేశమున అనేకమతాలు గలవు.అందుకే మన దేశాన పరమతసహనమునకాలవాలము.మనది హిందూ మతము.దీని యందు కర్మ సిద్ధాంతం మిక్కిలి ప్రధానం .ప్రపంచాన కనబడే హెచ్చుతగ్గులకు,తరతమభేదాలకు కర్మ సిద్ధాంతం సరియైన సమధానమునిచ్చును .

           పుట్టిన జీవులందరు ఒకే విధముగా ఎందుకు లేరు?కొందరుసుఖమును,మఱికొందరు దు:ఖమును ఎందుకు అనుభవించు చున్నారు?ఇట్టి గడ్డు సమస్యలను కర్మ సిద్ధాంత మొక్కటే పరిష్కరించగలదు.

          కారణములేకకార్యముండదు.అనే నియమముపై కర్మ సిద్ధాంతమాధారపడియున్నది.జీవులనుభవించుసుఖమునకైనను,దు:ఖమునకైననువారుపూర్వమాచరించినకర్మలేకారణము.సుకృతమొనర్చినవాడు సుఖమును,దుష్కృతమొనర్చినవాడు దు:ఖమును పొందితీరును.ఏ బీజమును నాటెదమో దాని ఫలమునే అనుభవింతుము కాని వేరే ఫలమును పొందలేముకదా .అటులనే మనము ఎట్టి కర్మ చేయుదుమో  అట్టి ఫలమునే అనుభవింతుమనికర్మసిద్ధాంతము చెప్పుచున్నది .

                ముందటి జన్మలో చేసిన కర్మలు గూడ ఈ జన్మలో  ఫలించు చుండును.అలాగే ఈ జన్మలో చేసిన కర్మలు మరుసటి జన్మలో అనుభవానికివచ్చుటయుగలదు.ఆరోగ్యము,దీర్ఘజీవితము,సంపద,కీర్తి,అధికారముమున్నగునవిపుణ్యకర్మలచేకలుగుఫలములు.రోగము,అకాలమరణము ,బీదరికము మున్నగు దుష్ఫలములుపాపకర్మలచే కల్గును.జ్ఞానోదయమగునంతవరకు ఈ కర్మఫలములు నీడవలె జీవులను వెన్నాడుచునేయుండును.భగవద్గీతలో "జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కురుతే తధా" చెప్పినట్లుగా జ్ఞానమనెడి వహ్ని సమస్త కర్మలను దహించుచున్నది.జ్ఞానవంతులై భగవత్సన్నిధి కి జేరిన ముక్త జీవులకికకర్మతో  ఎట్టి సంపర్కము లేదు.

                   కర్మానుగుణముగా జీవులకు పునర్జన్మ గల్గును.మానవుడు మరణిస్తే స్ధూల శరీరము మాత్రమే నశించును.సూక్ష్మశరీరము పూర్వకర్మలకు సంబంధించిన వాసనలతో గూడియే యుండును.

  "జాతస్య హి ధ్రువో మృత్యు:ధృవం జన్మ మృతస్య చ "అన్నట్లు అజ్ఞాన దశలో నున్నoతవరకుజననమరణములు ఎవరికిని తప్పవు.రానున్నజన్మలన్నియు పూర్వకర్మలఫలములే.మానవుడు మాసిన చొక్కాను విడిచి కొత్త చొక్కాను తోడుగుకున్నట్లే జీర్ణ శరీరమును విడిచికొత్త శరీరమును గైకొనుచుండును. ఒకే శరీరమునకు బాల్యము,యౌవనము,కౌమారము,వార్ధక్యము అను దశలు మారుచున్నట్లే ఒకే జీవునకు అనేక శరీరములు మారుచుండును.శరీరము అనిత్యము.జీవుడు నిత్యము.భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత జన్మలో పుణ్యకార్యములు చేసిభగవత్పాత్రులు కావలెను.అదియే జీవునిముఖ్య ప్రయత్నము.మనమెంత తపము చేసినను పుణ్యకార్యములు చేయకున్నమనము జననమరణాదులలో తిరుగుదము.

   "బ్రహ్మణ్యాధాయకర్మాణి సంగం త్యక్త్వా కరోతి య: 

అని భగవద్గీతలొ చెప్పినట్లుగా కర్మల వలన కల్గులాభములను ,చేసిన కర్మములన్నిటినిఆసక్తిరహితముగా కర్మలనాచరించినవానినిపాపములు తామరాకుపై నీటిబిందువులవలెఅంటవు. రామాయణం లో సీతపరిత్యాగము తరువాతఅగస్త్యాశ్రమమునకు వచ్చినపుడు ఆ ముని రామునకు కానుకగా ఒక మనిభూషనిచ్చెను.  ఆ మణి భూష వృత్తాంతమును తెలుపుమని యడుగగా ఆముని క్రిందివిధాన చెప్పెను.తాను కృతయుగములో తపమునకనువైన ప్రదేశముగురించి వెదుకుచుండగ నొక నిర్జనారణ్యమున కొలను పక్క ఆశ్రమమును చూచి అక్కడనొక దేహమునుచూచితిని.ఇంతలోనొక దివ్య పురుషుడు గగనమార్గమున వచ్చి ఆ దేహమును కోసి మాంసమును తిని కొలనులో నీరు త్రాగుచుండగా నతనిని అడిగితిని .విచిత్రమేమనగా అతడుతిన్నా ఆ మృత దేహము మామూలుగానైనది.ఆ పురుషుడిట్లనెను.ఓ మునీశ్వరా!సుదేవుడనే విడర్భరాజుకుమారుడునగుశ్వేతుడనునా తండ్రీ తరువాత మనోరంజకముగా ప్రజపాలనచేసి వైరాగ్యముకలుగ నాతమ్మునికి  రాజ్యపాలన యిచ్చి తపమును చేసి స్వర్గమునకు వెళ్ళితిని.అక్కడ నాకు బాగా ఆకలి వేయుచుండగా బ్రహ్మను కారణము నడుగగా బ్రహ్మ ఇట్లు చెప్పెను.ఓ రాజా!  నీవు ప్రజాపాలనచేసినపుడు ఎవరికిని అన్నము పెట్ట లేదు.దాహార్తులకు నీరివ్వలేదు.నీవు తపస్సు వల్ల దేవత్వం పొందినావు.ఎంత తపముచేసినాను అన్నదానఫలమునకు సాటిరావు.ఆశ్రమంగా అర్ధులకు అన్నదానంచెయ్యగలస్దితిలోనున్నప్పటికి నీవు చెయ్యలేదు.అందుకే ఆకలికి అలమటిస్తున్నావు.నిత్యమూ నీవు భూలోకానికి వెళ్లి నీవు విడిచిన కళేబరమును కోసి మాంసమును తినుము.ఎంతతిన్నా  ఆ శరీరము కొత్తగానుండును.కొంతకాలానికి అగస్త్యుడు వస్తాడు.అతనితో మాట్లాడినపుడు శవమాంసమును తినే దశ తప్పుతుంది అని .అతడు నాకు మనిభూషనివ్వగా అతనిశావము మాయమయ్యెను.మీరుధరిస్తే అతడు శాశ్వతబ్రహ్మ లోక నివాసమును పొందగలడు.అని ముని రామునికి చెప్పెను.

         పైదానిని బట్టి చేసినకర్మ ఎలాంటి వారికైనా అనుభవించకతప్పదని తెలియ చున్నది.కాన ప్రతిమానవుడు ఫలాపేక్ష,లేకుండా నిస్స్వార్ధతతో మంసికార్యములు చేసి భగవంతుని జేరునని యాసిద్దాము.

(తిరుపతి --తిరుమల దేవస్దానము వారు ప్రచురించిన హిందూ ధర్మపరిచయమను గ్రంధమాధారము)

                                       @@@@@

27, జనవరి 2017, శుక్రవారం

లాలిపాట

                                 లాలిపాట 

   జో అచ్యుతానంద జోజో ముకుంద
   రావె పరమానంద రామగోవింద .

  నందునింటను జేరి నయము  మీరంగ 
   చంద్రవదనలు నీకు సేవ చేయంగ 
   అందముగా వారిండ్ల ఆడుచుండంగ
   మందలకు దొంగ మా ముద్దురంగ 
   అంగజుని గన్న మాయన్న యిటు రారా 
  బంగారు గిన్నెలో పాలు పోసేరా
  దొంగ నీవని సతులు పొంగుచున్నారా 
   ముంగిటనాడరా --మోహనాకార 
   గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి 
   కావరమ్మున నున్న కంసు పడగొట్టి 
   నీవు మధురాపురము నెల చేపట్టి 
   ఠీవితో నేలిన దేవకీ పట్టి 
   అంగుగా తాళ్ళపాక న్నయ్య చాల 
  శృంగార రచనగా చెప్పే నీ జోల 
  సంగతిగ సకల సంపదల నీ వేళ
  మంగళము తిరుపట్ల మదనగోపాల   

ఉగ్గుపాట

అన్నమాచార్యులు రచించిన ఉగ్గుపాట

      మన పెద్దలు గత రోజులలో శిశువులకు ఉగ్గుపాలు పట్టుచు క్రిందిపాట పాడెడివారు.ఇప్పుడు అవి కనుమరుగవుతున్నాయి.

      ఉగ్గు పెట్టరే వో యమ్మా చె 
      య్యొగ్గీ నిదె శిశువో యమ్మా 
      కడుపులోని కమ్మలు కదలీ 
      నొడలూచకురే వో యమ్మా 
      తొడికెడి సరుగన తొలగతీయరే
     వుడికెడి పాలివి వో యమ్మా 

     చప్పలు వట్టుక సన్నపు బాలుని 
      నుప్పర యెత్తకురోయమ్మా 
     అప్పుడె సకలము నది మీనోరనె 
     వొప్పదు తియ్యరె వో యమ్మా 
     తొయ్యలు లిటు చేతుల నలగించక 
     వుయ్యల నిడరే  వో యమ్మా 
     కొయ్యమాటలనుకొండల తిమ్మని 
     ఒయ్యన తిట్టకు రోరమ్మా  
   

జీవుడు-భగవంతుడు 2

(contd )

అచ్చే ద్యో య మదాహ్యోయమక్లేద్యో శోష్య ఏవ చ,

నిత్యస్సర్వగతః స్ధాణు అని చెప్పుచున్నది.సనాతనః 

    జీవాత్మ కత్తి మున్నగు వానిచే నరకబడడు.జీవుని అగ్నిచే కాల్చుటకును,నీటిచే తడుపుటకును,గాలిచే నార బెట్టుటకునుశక్యముగాదు.గీతజీవుడునిత్యుడు,సర్వగతుడు,స్ధాణువు,చలనములేనివాడు,సనాతనుడు అని చెప్పుచున్నది..

           అనాదిగా సంక్రమించిన అజ్ఞానము అవిద్య యనబడును.అవిద్యచే ఆవరించబడిన జీవుడు సంసారములోతగుల్కొనిజననమరణములకులోనగుచున్నాడు. అట్టివాడు తన దివ్యత్వమును మఱచినాడు.జడమైన శరీరమున ప్రవేశించి చావు పుట్టుకలకులోనైనాడు.కామక్రోధాదులాతనిని బాధించుచున్నవి.అవిద్య ఎట్లు జీవునిని లోబరచుకొంది ఎవరికినితెలియదు.కానిదానినిజ్ఞానముచేతొలగించుకోనవచ్చును. జ్ఞానసంపన్నుడైన జీవుడు దేవుని సన్నిధికి జేరును.ఆ పై సంసారమతనిని బంధింపదు.దీనిని బట్టి చూడగా అవిద్యకు లోనైనవారు బద్ధజీవులనియు, దానినుండి విడివడినవారుముక్త జీవులనియు చెప్పుటకు సందేహ పడనవసరము లేదు.  

జీవుడు-భగవంతుడు -1

                              జీవుడు --భగవంతుడు 

                భగవంతుడన్న పదానికి పర్యాయపదాలు -ఈశ్వరుడు ,పరమపురుషుడు,దేవుడుపురుషోత్తముడుమొ ||నవి.మనము ఎంతమంది దేవుళ్ళున్నవారినారాధించిన ఆ పూజలు ఆ సమస్త దేవుళ్లలోఆంతర్యామిగ నున్న పరమేశ్వరుడొక్కనికే చెందును.ఏకమేవా ద్వితీయం బ్రహ్మ -మొ||గు వేదవచనములు ఈసత్యమునేచెప్పుచున్నవి.భగవంతుడుసకలకల్యాణములకునిలయము.   ఎట్టి దోషమతనియందు లేదు.సమస్తజీవుల హృదయాంతరాలలోపరమేశ్వరుడున్నాడు.ఆయన సంకల్పముతోనే సృష్టిస్ధితి లయములు జరుగుచున్నవి .తేన వినా తృణమపిన చలతి.అన్నట్లు భగవంతుని సంకల్పము లేక గడ్డి పోచయు  కదలదు.సత్యము,జ్ఞానము,ఆనందము మున్నగునవి భగవంతుని లక్షణములుగా వేదాలన్నీ చెబుతున్నాయి.ఇతనికెట్టి వికారములులేవు.అందుచే నితనిని నిర్వికారుడనబడుచున్నాడు. ఎట్టి దోషములు లేవు గాన నిర్మలుడు.సమస్త లోకములు అతనిలోనే యునికిని కల్గియున్నవి.కాలచక్రములోనిజీవులందరుముక్తినొందువరకుఈ విశ్వలీలఇట్లు సాగుచునే యుండును.భగవంతుడు దయామయుడు.కనుకనే లోకరక్షణకై  దుష్టులను శిక్షించుచు నిగ్రహానుగ్రహాలను పాటించుచు జననీజనక రూపమున ఈ రెండుగుణాలనుచూపుచున్నాడు.భక్తులఆరాధనలనందుకోడానికిఅవతారాల నెత్తు చున్నాడు.ఒక జీవకోటికే గాకసమస్త ప్రాణికోటికి సద్గతిని సమకూర్చుటకేర్పడినవి.
                                                    జీవుడులేకజీవాత్మశరీరముకంటెభిన్నముగానున్నాడు.పృధివి,జలము,తేజస్సు,వాయువు,ఆకాశము అను పంచ భూతాలతో  స్ధూలశరీరమునిర్మించబడినది.చర్మం,చక్షువు,శ్రోత్రము,జిహ్వ, ఘ్రాణము అను ఐదును జ్ఞానేంద్రియములు.జీవుడు వీని కంటె వేఱుగనున్నాడు.శరీరమునందుప్రాణము,అపానము,వ్యానము,ఉదానము,సమానము అను పంచ వాయువులుగలవు.జీవుడు ఆ వాయువులకంటెభిన్నుడు.మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అను వానితో గూడినసూక్ష్మ శరీరము గూడా జీవుడు కాడు. చావు పుట్టుకలు దేహమునకే గాని జీవునకు లేవు.కాన జీవుడు నిత్యుడని పిలువబడుచున్నాడు,జ్ఞానము జీవునకు ముఖ్యలక్షణము.మేలుకొని యున్నప్పుడు మనము బాహ్య ప్రపంచమునకుసంబంధించినజ్ఞానముగల్గియుండును.అప్పుడు ఐదు జ్ఞానేంద్రియములు పనిచేయుచుండును.అందుచే కనులతో చూచుట,చెవులతో వినుట,మున్నగు పనులు చేయగల్గు చున్నాము.స్వప్నావస్ధలో మనకు బాహ్య ప్రపంచ జ్ఞానముండదు.అపుడు జీవుడు మానసికముగా మాత్రమే సుఖదు:ఖములనుఅనుభవించు చుండును. గాఢ నిద్రలో మనస్సు గూడ పనిచేయదు.అపుడు జీవుడు పూర్తివిశ్రాంతి తీసుకొనును.
           "మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః"అనుగీత వచనానుసారము భగవంతుని అంశయే జీవలోకమునందు సనాతన జీవుడుగానయ్యెనని  తెలియచున్నది.దేశమునకు ,కాలమునకు అతీతుడైన జీవుడు సర్వకాల సర్వావస్ధలలో ఎట్టిమార్పులకు లోనుగాడు.రాయి,కొయ్య మొదలగు  పదార్ధాలు వలె జీవుడు జడ స్వరూపుడుగాడు.(CONTD)

16, జనవరి 2017, సోమవారం

కధ

                                   చిన్నకధ 

    రవికిరణ్ అనే వాడు చిన్నప్పుడు చాలా కష్టాలు పడిన సమయంలో భారత దేశానికి మహాత్మాగాంధీజీ స్వతంత్రత యిచ్చినందుకుగాను అతని బొమ్మనునోటుపైనగానికార్యాలయలలోగాని,ముద్రించడము,నిర్మించడము జరుగుతోంది. ఇప్పటికి రవి అప్పటికాంగ్రెస్సు ను గౌరవిస్తూ తానుRSSలో  నుండి వారి సహకారముతో ఆ దేశానికి నాయకునిగానెన్న బడి నప్పుడు ఆ కాంగ్రెస్సునుతిడుతున్నాడు.ఇప్పటివరకుమతసహనమన్నపేరునుకల్గినదేశమునమతమార్పిడులనుచేయిస్తూప్రజలనుమభ్యపెడుతూ,ప్రజలకష్టాలనుతొ లగించకతనమాటే నెగ్గాలని ప్రజలు తనకు సహకరిస్తున్నారని ప్రసంగాలు చేస్తూ పెద్దనోట్లురద్దుకార్యక్రమా న్ని ప్రారంభించి ప్రజలనిబ్బందిపెడుతూ పాలన సాగించడ మెంత సబబొఆలోచించక అతనినే పొగడ డమెంత సబబోగ్రహించగలరు.ప్రజాహక్కులను భంగపరచు టఅతని స్వభావమా?తానే  ఏకైక నాయకునిగా గర్వపడితే తనవినాశమును కోరుకున్నట్లే.   ఇదంతా చూస్తే అతని స్వార్ధము బయటపడ్తోంది.అదే సాధరణ పౌరుడుస్వార్ధంతో ప్రవర్తిస్తే శిక్షిస్తుంటే పెద్దవారు,ధనవం తులు మిక్కిలి స్వార్ధముతో సామాన్య ప్రజలను లెక్కజేయక వారిని వారి సంపదలను ఏదోరకముగా దోస్తూ రాక్షసత్వముగా ప్రవర్తిస్తున్నారు.ఇది స్వార్ధ మహిమయే గదా! స్వార్ధాన్ని ప్రతిమానవుడు అంటే సమాన్య్డు ధనవంతుడు అనే తేడా లేకుండా మనమందరమూ వేర్వేరుమతాలవారమైన,వేర్వేరుకులాలవారమైన ,వేర్వేరు భాష లుమాట్లాడే వారమైన,సమానముల మేయనిభావించి స్వార్ధములేకుండా పరస్పర సహకారముచేసుకుంటూ ఉంటె ఈ పరిస్ధితి రాదు గదా ?మనదెశాన్నీతర దేశాలకు బానిస కాకుండా నిస్స్వార్ధపరులే చూడగలరు.