24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

విచారణ

సహజపండితుడైన బమ్మెర పోతన రచించిన భాగవతంలో క్రింది పద్యమును పరిశీలించిన అనేక విషయాలు కనబడతాయి.

గజేంద్రమోక్షంలో మొసలిచే పీడింపబడుచున్న గజేoద్రుడు మొర పెట్టుకొను సందర్భంలోని పద్యమును చూడుడు.

కం||నర్తకునిభంగి బెక్కగు 

        మూర్తులతో నెవ్వడాడు?మునులు దితిజులుం 

        గీర్తింప నేర?రెవ్వని 

        వర్తనమొరులెఱుగ రట్టివారి నుతింతున్.

 ఎనుబది నాలుగు లక్షల రకాల జీవరాశులతోను,ఒక్కొక్క రకానికి కోటానుకోట్లుగా రూపములు ధరించి ఆయా రూపనామమునకు తగినట్లుగా నటించు ఆ నటనా సార్వభౌముడైన వాడెవ్వడు?మనమున్ను చేయు ఇష్ట కామ్యఫలసిద్ధికై గాని,లేదా,మోక్షమునకైగాని,దేని గురించైనాసరే సాధనప్రారంభించుటకు ముందుఈ ప్రశ్న ఎవరికి వారే ప్రశ్నించుకొందుముగాక.ఇది మన భవిష్య త్కార్యక్రమమునకు తోడ్పడుతుంది.ఇక్కడనుండి సాధకుని "ఆత్మాన్వేషణ"ప్రారంభమౌతుంది.అదే భగవద్దర్శనమునకై అన్వేషణ యనబడును.ఇష్ట కార్య సఫలతను పొందుటకు వెళ్ళవలసినమార్గము,చేరవలసిన గమ్యము ,పొందవలసిన ఫలము ,ఇవన్ని ఇక్కడ నిలబడి ఆలోచించాలి.

బజారులో ఒక్కొక్క దుకాణంలో ఒక్కొక్కరకమైన వస్తువులే దొరుకుతాయి.ఉదాహరణకు పువ్వులకొట్లో కి వెళ్ళి కట్టె లడిగితేదొరకవు గదా. అలాగే వివిధవస్తువుల భండార్ అనేదిఒకటిఉంటెఅక్కడసర్వవస్తువులులభించునన్నమాట.యికనాలుగువస్తువులకినాలుగుదుకాణములగుమ్మాలెక్కి దిగవలసిన పనిలేదుగదా.అటులనే  నానా రకాలైన మతాలు,నానారకాలదైవములు,యివన్నీదుకాణాలనిపించుకుంటాయి.  వీట్లలో ఒక్కొక్క వస్తువు మాత్రమే దొరుకుతాయి.కాని అన్ని వస్తువులకు నిలయమైన,అన్ని మత,సిధ్ధాoతములధ్యేయమైన,దైవమేదైతేయున్నదోఅట్టి దేవాదిదేవుణ్ణి చేరుకోడానికి ప్రయత్నించాలి.  .అట్టి మార్గములో పయనించి పరమాత్మను  దర్శించి బంధనివృత్తి అనెడి మోక్షానందఫలమును పొంది అనుభవించాలి.ఆ గమ్యము చేరిననీవువివిధవస్తుభండార్  అనే సర్వ వస్తుప్రాప్తానందస్ధితినిపొందిఆనందించగలవు.

అట్టి ఆనందస్ధితినే "బ్రహ్మానందం,పరమసుఖదo "అని చెప్పబడినది.ఆ స్ధితికై ఫలమునిచ్చు దైవము సర్వ శరీరములనే వివిధ వేషము ధరించి,తాను తానైవుండి  ఆ యా  దేహమునకు తగినట్లుగా నటించుచున్నవాడు నటులలోకెల్లశ్రేష్ఠుడు అయిన ఆత్మశక్తియే .కాన ఆత్మశక్తిని తెలుసుకొని దానిని పొందుటకు చేయు ప్రయత్నము నిజమైన ప్రయత్నము.అందుకే గజరాజు చాల తీవ్రముగా తన్ను తాను ప్రశ్నించుకున్నాడు.నర్తకుని భంగి పెక్కగు మూర్తులతోనెవ్వడాడు "అని.

              ఇక ఆత్మశక్తిని తెలుసుకొనియింత అంతియనిగాని చెప్పడానికి,వర్ణించడానికి,ఇది,అది,యనిగాని,చూపడానికి సాధ్యపడేదిగాదు.అది ఎంతటివారైనసరే --మునులుగాని,వేదవేదాంగ పండితులకు గాని అసాధ్యమే!మరెలా?గురువు చూపిoచడా?అని ప్రశ్నించుకొంటే గురువు కేవలము  గురుతు మాత్రమె చూపగలడు.అంటే తాను వెళ్ళుమార్గమునుచెప్పగలడుగానిదానిగూర్చిచెప్పుటకధికారము లేదు. చేప్పాలనుకున్నా అక్షరమాల సరిపోదు.ఆత్మను గూర్చి సరిగ్గా తెలుసుకుంటే యిక వాడు చెప్పవలసినది లేదు.చేయవలసినదేమియులేదు. అవధులు దాటిన అవధూత యగును. .అట్టివానికి దైవపిచ్చి తప్ప అన్యపిచ్చిలేదు.ఆ స్ధితిలో వారు సర్వస్వతంత్రులు.చెప్పవలసినది,చేయవలసినది అనే బంధము బాధ్యత వారికి లేవు.ఉండవు.ఇదే జీవన్ముక్తస్ధితి అనగాజీవించియుండగానే(శరీరములోయుండగానే)ముక్తిని అనుభవించుట.జ్ణాన నేత్రము గలవాడు,మాత్రమే చూడగలడు.గ్రహించగలడు .అనుభవించగలడు..అని భగవానుడే చెప్పెను.అయినా సాధకులుఉత్సాహములో సాధన చేయమని,అది చాలా అసాధ్యమైనదని చెప్పబడినది.అందుకే గజేంద్రుడు మునులు,పండితులు సైతం ఎవనిగూర్చి సంపూర్ణంగా కీర్తింపజాలరో అట్టి వానిని శరణు .జొచ్చెదనని చెప్పెను.

ఎవ్వని వర్తనమొరులెరుగరో?.అంటాడు గజేంద్రుడు.నానా విధములైన ,నానారకాలైనఅనేక విధములగు రంగులు,వాసనలు కల పువ్వులన్నియు ఒకానొకదానిపై ఆధారపడి "మాల"గా రూపు ధరించుచున్నది.మాలకు ఆధారము దారము కంపించదు.అటులనే సమస్త జీవరాశులు,పంచ భూతములు అనే పువ్వులు "ఆత్మశక్తి"అనే దివ్యశక్తిపై ఆధారపడిప్రపంచాన్ని మాలగా రూపు దాల్చినది.ఎవ్వరును ఆ శక్తిని మాంసపు కన్నులతో సద్గువు సాయము లేనిదే చూడలేరని పోతన పై పద్యము ద్వారా మనకు తెలియజేసినాడు.

23, ఫిబ్రవరి 2017, గురువారం

kavitavaichitri

కవితా వైచిత్రి

. క్రింది పద్యములో      ప్రత్యుత్తరాలుండటంరెండుప్రశ్నలకొక్కటే చిత్రంగా సమాధానం కావటం విశేషాలు.

ఎద్దీ శునకశ్వoబగు?-కృషిని లెద్దానివాంఛింతురెల్లయప్డు ?

విడెమునెద్దాననొక్కంగగడగునరుడు? "పంట"నని                                                              యుత్తరము చెప్పువాడ,సఖుడ!

ప్ర :1 .ఏది (ఎద్ది)ఈశ్వరునికి వాహనమగునవి?

      జ:ఎద్దు -శివుని వాహనము.

ప్ర 2.కర్షకులు అన్ని వేళల యందు దీనిని కోరుకొందురు?

ప్ర 3..మానవుడు .తాంబూలమును (వక్కాకును,విడెమును)దేనితో నొక్కి కోరుకును?

పై రెండు ప్రశ్నలకు పంటన్ -అనునది ఒక్కటే సమాధానము.ఎలా?-రైతులు పంటనే కోరుకొందురు.

నరుడు తాంబూలమును దంతములతో (పన్నులతో,పంటన్).కొరుకునుగదా .

18, ఫిబ్రవరి 2017, శనివారం

కవితావైచిత్రి

క్రింది పద్యమును పరిశీలన చేసిన పది ప్రశ్నలు కనబడును.వానికన్నింటికిఒకేపదము(రెండక్షరాలుగలది)సమాధానమగును.ఇది నియమము.

సీ.ఏకచక్రమునెక్కురేబెవ్వడు2ఒడలెల్లగనులైనయెడయ                                                                                         డెవడు?

3.మఱ్ఱి యాకున బండు కుఱ్ఱ వాడెవ్వడు?4.శివుని యౌదల                                                                       జేరి చెలగునెవడు ?

5.సమతమై సర్వ భూతముములనేలునెవడు?6.వాయు 

                                       భక్షణచేసిబ్రతుకునేది?

7.అఖిల జివనంబులకాధారమగునేది?8.కొమరార మారుని 

                                                    గుఱ్ఱమేది?

9.కంధి చాటి లంక గాల్చిన మృగమేది?10.క్షితిని జల్లబడగ

                                                    జేయునేది?

ఈ నియమాన్ని అనుసరించి (హరి)అనునదొక్కటేసమాధా నమగును.  


1.ఒకే చక్రము గల బండినెక్కి తిరుగు వాడెవ్వడు?

                                           హరి (సూర్యుడు)

2.దేహమునిండాకన్నులు గలవాడెవడు ?

                                          హరి(దేవేంద్రుడు )

3.మఱ్ఱి యాకుపై పరుండు బాలుడెవడు?

                                       హరి(కృష్ణుడు)

4.శివుని శిరస్సుపై ప్రకాశించు వాడెవడు?

                                     హరి (చంద్రుడు)

5.సర్వ ప్రాణులను సమానంగా పాలించు వాడెవ్వడు?

                                        హరి (యముడు)

6.గాలిని మేసి బ్రతుకునేది?--హరి (పాము)

7.సర్వ ప్రాణులకు ముఖ్యాధారమేది?--హరి (గాలి)

8.మదనునకు సుందర వాహనమేది?--హరి (చిలుక)

9.సాగరం దాటి లంకా దహనము చేసిన మృగమేది?

                                  హరి (కోతి)(హనుమంతుడు)

10.భూమిని చల్లబడునట్లు చేయునదేది?--హరి (వాన)

హరి శబ్దానికి నానార్ధాలు :

యమానిలేంద్రచంద్రాదర్క విష్ణు సింహాం శువాజిషు !

శుకాహికపిభేకేషుహరిర్నా,కపిలేత్రిషు (అ.కో.) 

5, ఫిబ్రవరి 2017, ఆదివారం

kavitaavaichitri

            క్రింది శ్లోకాన్ని పరిశీలిస్తే ఒకే సమాధానము వచ్చేప్రశ్నలు కనబడతాయి.

పూ:కీ దృక్ ?కా  మాధవేష్టా?యతే ర్వాక్ కీ దృక్?కంపాహీ                                                                         శ్వరే త్యాహ భక్తః ?

ఆదే రాదే రుద్ధృతైకైకవర్ణః శబ్దస్తేషూ త్తరo నైవమంతే |

పై దానిలో ని నాల్గు ప్రశ్నలకు "రామా రామా "ఒక్కటే సమాధానము.ఎట్లన దానిలోని మొదటి ఒక్కొక్క అక్షరాన్ని క్రమంగా తగ్గిస్తూ పోయినచో "మారామ ,రామా,మా,"గా విభాక్తములై ప్రత్యుత్తరాలగుచున్నవి.

ప్రశ్న :పట్టణముఎట్లున్నది?

జ:రామారామా =1.రామ +ఆరామా 2.రామా +ఆరామా 3.రామారామా =1.అందమైనతోటలతో గూడియున్నది.

   2.సుందర భామలతోనిండిన ఉపవనాలు కలిగియున్నది.

    3.అందము గల సుందరీ మణులు గల్గియున్నది.

 2.  విష్ణువునకు ఇష్టురాలెవరు?జ:(.రానుతగ్గింపగా)మారామా =రమాసుందరి,లక్ష్మి 

3.సన్న్యాసి మాట ఎట్టిది?జ:మొదటి రా,మా,అనే రెండక్షరాలు పోగా ,మిగిలిన రా: ,మా =ధనము,వద్దు అనగా ధనాశ పనికిరాదని సన్న్యాసి భావము.

4.భక్తుడు ఎవరిని రక్షింపమనికోరును?

జ:మా (=నన్ను ).ఇది అస్మద్ శబ్దం యొక్క ద్వితీయైక వచనము .(మామ్-మా)ఆదినుండి క్రమంగా ఒక్కొక్క అక్షరం తగ్గించుటచే ,ఇది హీయమానాక్షరమైనది.   

3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

కవితావైచిత్రి

                                     కవితావైచిత్రి 

కవితారీతులలో సంవాదాత్మక రీతి మిక్కిలి తమ తమ సమాచారమును తెలుపు కొనుటయే కాని ఇట్టి సంవాదాలు శ్లేషతో,వక్రోక్తులతో,ఎత్తిపొడుపులతోలేకహాస్యంగానో,చమత్కారాలు చిందించటం సర్వసాధారణం.కేవలం సంభాషణచప్పగాఉంటుంది.దానిలోచమత్కారచందనాన్ని కలిపి పూస్తే ఆనందాన్ని అందిస్తుంది.ప్రస్తుతంఒక బావ  తన మరిదితో ఎదుటనున్న ఆవులలో నొకదానిని తెమ్మన్నాడట.ఇక్కడ గద్యాన్ని పద్యరూపములో బంధించడం జరిగింది.
  బావమరిదిoగనిఆ-యావులలోనొకటితెమ్మియనగానపుడే
  యావని యడిగిన వాక్యము -గావలయున్ భాషలైదుగా                                                                             నొక పదమునకున్. 
 పై ప్రశ్నా వాక్యాన్ని1.ఏ-2.ఆవ్ -3రా -4.బా -5.వా అని   విడదీస్తేఅవి క్రమంగా 1.మహారాష్ట్ర 2.హిందీ 3.ఆంధ్ర  4.కర్ణాటక5.తమిళంభాషలైదింటిలోనుసమాధానమౌతుంది.   అక్షరం                 భాష                అర్ధం 

   ఏ                మహారాష్ట్ర              రమ్ము 
  
  ఆవ్              హిందీ                      రమ్ము 

   రా                ఆంధ్ర                      రమ్ము 

   బా                కర్ణాటక                    రమ్ము 

  వా                 తమిళం                 రమ్ము 

ఇట్లు ఐదు అక్షరాలు  గలఒక తెలుగు వాక్యంలోని ఐదు అక్షరాలు విడివిడిగా ,ఐదు భాషలలో,ఒకే అర్ధాన్ని చెప్పుచు  సామూహికముగా ప్రశ్నావాదకం కావటం చిత్రాలలో మహావిచిత్రం.కాదనగలమా!