28, జులై 2016, గురువారం

తెలుసుకో

                తెలుసుకో 
మంచిమిత్రులెప్పుడుపాలలోనీరుకలుస్తున్నట్లుగాఒకర్నొకరువిడువకకలసిమెలసిఉంటారు. ఇద్దరు ఒక్కటే అన్నట్లుగా ఉంటారు.భర్తృహరి సుభాషితాలలోనిట్లున్నది.
1.క్షీరేణాత్మగతోదకాయ హిగుణాదత్తాఃపురాతేఖిలాః క్షీరోత్తాపమవేక్ష్య తేన పయసా స్వాత్మాకృశానౌ  
గంతుంపావకమున్మనస్తదభావదృష్ట్యాతు మిత్రా పదం
యుక్తం తేన జలేన శామ్యతి,సతాం మైత్రీ పునస్త్వీదృశీ \\  
అంటే తనలో కలసిన నీటికి తన గుణాన్నే పాలు కలిగిస్తాయి.అది పాలసద్గుణము.ఇక నీరు కూడమిత్రునిపట్లగలఅవినాభావసంబంధముచేతఅట్టిసన్మిత్రునికలిసికొంటేగానితాపము తీ రనిగుణాన్ని కలిగి ఉంది.అంటే పాలునీళ్ళతో కలిపి కాచుచున్నప్పుడు నీరు ఆ వేడికి ఆవిరైపోతుంటే పాలు తనమిత్రునికై గిన్నె అంచు వరకు పొంగుచున్నప్పుడు కొంచెము నీరు ఆ గిన్నెలో పోస్తుంటే అవి అణుగుతాయిగదా!
  2.  శ్లో||పితా రక్షతి కౌమారే 
          భర్తా రక్షతియౌవనే 
         రక్షంతి వార్ధకే పుత్రా 
         న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. 
బాల్యములో స్త్రీని  పోషించాలి.యవ్వనములోభర్త పోషించుతాడు.వృద్ధాప్యంలో పుత్రుడు పోషిస్తాడు.అంతేకానివారినెవ్వరినిలేక్కచేయని వనితలుఅందరిలోనగుబాటుపడుదురనియర్ధము.  నవీనమునవనితలకివి తలకెక్కక లేక పేదరికము చేతను మగవారితో పాటు ఉద్యోగములుచేయుచుపలుకష్టాలననుభవించుచున్నారు.
3.భూప్రదక్షిణేనషట్కేన
   కాశీయాత్రాయుతేనచ 
  సేతుస్నాన శతైర్యశ్చ  
  తత్ఫలం మాతృ వందనే 
ఆరుసార్లు భూ ప్రదక్షిణ చేసినా,ఎన్నోసార్లు(కాశీవద్ద)గంగాస్నానము,సముద్రస్నానాలు(రామేశ్వరంవద్ద)చేయగావచ్చిన ఫలము కంటే తల్లి కి  పాదాభివందనం చేయగా వచ్చిన ఫలము గొప్పది.ఈ విషయము వినాయక,కుమారస్వామిలప్రదక్షిణాలవల్లస్పష్టమౌతుంది. 
4.శ్లో|| ధనాన్ని భూమౌపశవశ్చగోష్ఠేే
         నారీ గృహ ద్వారే,జనః శ్మశానే,
         దేహశ్చ  తాయాం పరలోకమార్గే 
        కర్మానుగో గఛ్చతిజీవ ఏకః
ఈ లోకం నుండి పోయేటప్పుడు మనవెంట ఏవి రావు.సంపాదన పెట్టె లోకి,భూమిగృహము  లోనికి,గోసంపద పశువులశాలలోను,భార్య వీధి ద్వారముదగ్గర,జనులుశ్మశానమువద్దకుచేరుదురు .దేహము చితికి ఆహుతి ఔతుంది. మను చేసిన మంచిచెడులే మనతో వస్తాయి.       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి