28, జులై 2016, గురువారం

తెలుసుకో

                తెలుసుకో 
మంచిమిత్రులెప్పుడుపాలలోనీరుకలుస్తున్నట్లుగాఒకర్నొకరువిడువకకలసిమెలసిఉంటారు. ఇద్దరు ఒక్కటే అన్నట్లుగా ఉంటారు.భర్తృహరి సుభాషితాలలోనిట్లున్నది.
1.క్షీరేణాత్మగతోదకాయ హిగుణాదత్తాఃపురాతేఖిలాః క్షీరోత్తాపమవేక్ష్య తేన పయసా స్వాత్మాకృశానౌ  
గంతుంపావకమున్మనస్తదభావదృష్ట్యాతు మిత్రా పదం
యుక్తం తేన జలేన శామ్యతి,సతాం మైత్రీ పునస్త్వీదృశీ \\  
అంటే తనలో కలసిన నీటికి తన గుణాన్నే పాలు కలిగిస్తాయి.అది పాలసద్గుణము.ఇక నీరు కూడమిత్రునిపట్లగలఅవినాభావసంబంధముచేతఅట్టిసన్మిత్రునికలిసికొంటేగానితాపము తీ రనిగుణాన్ని కలిగి ఉంది.అంటే పాలునీళ్ళతో కలిపి కాచుచున్నప్పుడు నీరు ఆ వేడికి ఆవిరైపోతుంటే పాలు తనమిత్రునికై గిన్నె అంచు వరకు పొంగుచున్నప్పుడు కొంచెము నీరు ఆ గిన్నెలో పోస్తుంటే అవి అణుగుతాయిగదా!
  2.  శ్లో||పితా రక్షతి కౌమారే 
          భర్తా రక్షతియౌవనే 
         రక్షంతి వార్ధకే పుత్రా 
         న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. 
బాల్యములో స్త్రీని  పోషించాలి.యవ్వనములోభర్త పోషించుతాడు.వృద్ధాప్యంలో పుత్రుడు పోషిస్తాడు.అంతేకానివారినెవ్వరినిలేక్కచేయని వనితలుఅందరిలోనగుబాటుపడుదురనియర్ధము.  నవీనమునవనితలకివి తలకెక్కక లేక పేదరికము చేతను మగవారితో పాటు ఉద్యోగములుచేయుచుపలుకష్టాలననుభవించుచున్నారు.
3.భూప్రదక్షిణేనషట్కేన
   కాశీయాత్రాయుతేనచ 
  సేతుస్నాన శతైర్యశ్చ  
  తత్ఫలం మాతృ వందనే 
ఆరుసార్లు భూ ప్రదక్షిణ చేసినా,ఎన్నోసార్లు(కాశీవద్ద)గంగాస్నానము,సముద్రస్నానాలు(రామేశ్వరంవద్ద)చేయగావచ్చిన ఫలము కంటే తల్లి కి  పాదాభివందనం చేయగా వచ్చిన ఫలము గొప్పది.ఈ విషయము వినాయక,కుమారస్వామిలప్రదక్షిణాలవల్లస్పష్టమౌతుంది. 
4.శ్లో|| ధనాన్ని భూమౌపశవశ్చగోష్ఠేే
         నారీ గృహ ద్వారే,జనః శ్మశానే,
         దేహశ్చ  తాయాం పరలోకమార్గే 
        కర్మానుగో గఛ్చతిజీవ ఏకః
ఈ లోకం నుండి పోయేటప్పుడు మనవెంట ఏవి రావు.సంపాదన పెట్టె లోకి,భూమిగృహము  లోనికి,గోసంపద పశువులశాలలోను,భార్య వీధి ద్వారముదగ్గర,జనులుశ్మశానమువద్దకుచేరుదురు .దేహము చితికి ఆహుతి ఔతుంది. మను చేసిన మంచిచెడులే మనతో వస్తాయి.       

23, జులై 2016, శనివారం

గుర్తుంచుకో

గుర్తుంచుకో
1.శ్లో ||ఈర్ష్యీ ఘణి త్వ సంతుష్టః క్రోధనోనిత్య                                                                       శంకితః
         పరభాగ్యోప జీవీ చ షడేతే దు:ఖ భాగినః  

అసూయకలవాడు ,రోతపడువాడు,సంతృప్తి లేనివాడు,ఎల్లప్పుడూసందేహించువాడు,ఒకరిపై ఆధారపడి జీవించు వాడు,దు:ఖమును పొందుదురు.
2.షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతి మిఛ్ఛితా 
నిద్రాతన్ద్రాభయంక్రోధమాలస్యందీర్ఘసూత్రతా  
ఐశ్వర్యమును కోరునట్టివాడు క్రింది యారింటిని విడువవలెను.
1.నిద్ర 2.కునికిపాటుతనము,3.భయము 4.కోపము 5.సోమరితనము 6.ఆలస్యముగా పని చేయుట 
3.దానం ప్రియవాక్సహితం 
   జ్ఞానమగర్వం క్షమాన్వితం శౌర్యం 
  త్యాగసహితంచ విత్తం 
  దుర్లభమే తచ్చతుష్టయం జగతి.
ఆదరణతోకూడినదానము,గర్వము లేని జ్ఞానము,ఓర్పుతో కూడిన పరాక్రమము ,త్యాగముతోకూడిన ధనము దొరుకుట ఈ లోకములో కష్టము.
4.సర్వాః సంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసమ్ 
ఉపాసద్గూఢపాదస్య నను చర్మా వృతేవ భూ: 
ఎవని మనస్సు తృప్తి చెందునో         
వానికి సకలసంపదలు కల్గును.కాలికి చెప్పులు తొడిగినవానికి భూమి యంతయు తోలు కప్పినది గనేయుండునుగదా! 
5.బ్రాహ్మణాః పాదతో మేధ్యా  
   గావో మేధ్యాస్తు పృష్టతః 
  అజాశ్వే ముఖతో మేద్యౌ 
  స్త్రియో మేధ్యాస్తు సర్వతః 
ఈ లోకములో స్వతహాగా పవిత్రమైనవి -  మంగళ దాయక మైనవి.  
సద్బ్రాహ్మణుని(సద్భక్తుని)పాదారవిందాలు,ఆవుయొక్క వెనుక భాగము,మేకల,గుర్రాలముఖ భాగము,ఉత్తమురాలైన స్త్రీయొక్క సర్వాంగాలు శుభకరం. అంటే వీటిని చూచినా,ముంటుకొన్నా శుభం కలుగుతుంది .    

15, జులై 2016, శుక్రవారం

సుజనుడు

                          సుజనుడు 
సుజనుడు (విద్వాంసుడు,పండితుడు,జ్ఞాని )
సాధారణముగా విద్వాంసులుఏమహారాజునో ఆశ్రయించి తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఆ రాజుచే సన్మా నితులైలోటులేకుండాజీవితం   గడిపేవారు.కాని అలా చేయుటవలన వారి కి ప్రయోజనము సిద్ధించదు.లోక స్ధితి సుస్దిరమై నిలబడటానికి విద్వాంసుల ప్రవర్తన కారణ భూ భూతమవుతుంది.ఎందువలనంటే మెలిగే తీరు వారికి బాగా తెలుస్తుంది. వీరి పద్ధతి ఇలా ఉంటుంది.మంచివారి సహవాసం పట్ల ఆసక్తీ ,గుణవంతులవారి పట్ల అనురాగము,గురువులు-పెద్దలపట్ల అణకువ,విద్యా ర్జనయందుఆసక్తీ ,దైవభక్తి,దుష్టులకు దూరంగా ఉండడం ఉత్తములలక్షణము. వీరిహస్తాలకికంకణాల క్కర లేదు. సత్పాత్రులకు దానము చేయడమే వారికికంకణాలు.సత్యభాషణము,పరాక్రమము,శాస్త్రశ్రవణము,సత్ప్రవర్తన,నిగర్వము,ఇతరులకు తాను  చేసినఉపకారమును తానెవ్వరికి చెప్పకుండుట,ఇతరులపనులుచక్కదిద్దడము,
వీరుకొబ్బరికాయలవలెకనబడుదురు.బంగారపు కుండవలె విడ దీయుటకువీలులేనివాడును, తిరిగిశీఘ్రముగా కూర్చుటకుతగినవాడును ఐయున్నాడు. ఇట్టిసహజ గుణాలు కలవారు లోకములో బాగా గౌరవింపబడతారు.మనము గూడా అట్లుండుటకు ప్రయత్నము చెయ్యాలి.
                        *****

మూర్ఖుడు

                          మూర్ఖుడు 
       అన్నివిధాలతెలిసినవారుఎప్పుడునుఅసూయతో నుంటారు. ప్రజా పాలకులె ప్పుడు గర్వము.అధికారము వల్లవచ్చిన మదముచేత ప్రజల బాగోగులనుచూడకవారిని బాధలు పెట్టుచుతమఅభివృద్ధినిపెంచుకొనుచున్నారు.
    అజ్ఞఃసుఖమారాధ్యస్సుఖతర
    మారాధ్యతే విశేషజ్ఞః 
     జ్ఞానలవదుర్విదగ్ధం 
     బ్రహ్మాపి నరం న రంజయతి.
అంటే ఏమి తెలియని వానికిన చెప్పచ్చు.తెలిసినవానికి కూడా చెప్పచ్చు.కాని తెలిసితెలియనివానికసలుచెప్పలేము.బ్రహ్మకుకూడాసాధ్యము కాదు.    
తెలియని మనుజుని సుఖముగ 
దెలుపందగుసుఖతరముగతెలుపగవచ్చున్ .
దెలిసినవానిం దెలిసియు 
దెలియని నరుదెల్పబ్రహ్మదేవునివశమే  
ఇంకను మొసలి నోట్లో ఉన్నమణినితీయవచ్చు కాని,భీకరమైన సముద్రాన్ని దాటవచ్చుకాని,పా మునైనాఒడుపుగాపట్టవచ్చు కాని మూర్ఖునికి  మాత్రముచెప్పలేము .
తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు 
దిరిగికుందేటి కొమ్ము సాధింపవచ్చు 
జేరి మూర్ఖులమనసు రంజింపరాదు.వీరు చేసేపనులిట్లుండును.తామరతూళ్ళకు ఉండే సన్నని నారతో  మదపుటేనుగును కట్టాలని చూడటం,దిరిసెనపువ్వుఅంచుచేత వజ్రాన్ని కోయాలని చూడటం,ఉప్పు సముద్రములోతేనె కలపాలనిచూడటం,ఎటువంటి అవివేక చర్యలో అటులనే మూర్ఖుని మనస్సును మార్చడానికి చేసే ప్రయత్నం అంత అవివేకము.మరియు  గంగ ఆకాశంబునుండి శివునితల పైకిఅక్కడనుండి పర్వతాలమీదుగా భూమిపైకి వచ్చిఅటనుండిపాతాళమునకుప్రవేశించునట్లుగామూర్ఖులు(వివేకభ్రష్టులు)వర్తనలు.నిప్పునుఆర్పడానికి నీరుఎండవేడిని తట్టుకోడానికి గొడుగు,ఏనుగును అదుపులోనుంచడానికి అంకుశముజంతువుల నుకాయటా నికి కర్ర,రోగాలు తగ్గటానికి మందులున్నాయి కాని మూర్ఖుని మూర్ఖత్వాన్ని పోగొట్టడానికి మాత్రమేమియును లేవు.మూర్ఖుడు ఎంత విద్యావంతుడైన వాని బుద్ధి మాత్రము మారదు .
ఎందువలననగా స్వభావ సిద్ధముగానే ఆవుపాలు మధురముగానే యుండును.అట్లే స్వభావ సిద్ధముగా దురాత్ముడు కూడా మారడు.
*శోక స్ధాన సహస్రాణి భయస్ధానశతానిచ 
దివసే దివసే మూఢ మావింశతి న పండితమ్ .
ప్రతిరోజూవేలకొలదిదు:ఖకారణములు,వందలకొలది భయకారణములు మూర్ఖునకుమాత్రమే కలుగుచుండును.మూర్ఖుడు(దుర్మార్గుడు)మట్టికుండ వలె తేలికగాదిoపదగినవాడును,తిరిగి కూర్చదగినవాడునుఐయుండును.మూర్ఖులుభయమువలన,,ఆశవలననుకలియుదురు.రేగుపండు వలె కనబడుదురు.   (హితోపదేశము , భర్తృహరి సుభాషితములు --ఆధారగ్రంధములు  ) 

12, జులై 2016, మంగళవారం

అష్టకష్టాలు

                         అష్టకష్టాలు 
పెద్దలు చెప్పుతారు ఎవరైనా కష్టపడి వృద్దిలో నికి వస్తే.కష్టాలుఎనిమిదిఉన్నాయంటున్నారు.
భర్తృహరి సుభాసితాలును పరికించిన 
ఋణం,యాచ్చాచ,వృద్ధత్వం 
జార ,చోర, దరిద్రతా 
రోగశ్చ,బుక్త శేషశ్చా 
హ్యష్ట కష్టాః ప్రకీర్తితాః 
1.అప్పులు చేయవలసి రావడం 
2.జీవనయాత్ర సాగడానికి అడుక్కోవలసి రావడం 
3.వార్ధక్యవశాన అన్నిటికి ఇతరులపై ఆధారపడటం 
4.జారత్వంచేత అవమానాలు ఎదుర్కోవడం 
5.చోరత్వంచేత అపవాదులు 
6.దరిద్ర బాధలు 
7.రోగపీడ 
8.ఒకరి ఎంగిలి తిని ప్రాణము నిల్పుకోవలసి రావడం కనుకనే ఇవి పగవాడికి కూడా కలగరాదని కోరుకొంటారు.
అందుచే ప్రతీ వారును అట్టి కష్టాలను కోరుకోవలదు.