18, మార్చి 2017, శనివారం

లక్ష్మిపార్వతుల సంభాషణా పద్యం

బందరులో తిరుపతి వేంకట కవుల అష్టావధానం లో క్రింది పద్యం చెప్పబడినది              సీ ||గంగాధరుoడు నీ మగండని నవ్వoగవేష ధరుడు నీ పెన్మటనియె,

        ఎద్దునెక్కును నీదునెమ్మికాడనినవ్వగ్రద్దనెక్కునునీదుమగండటనియె         వల్లకాడిల్లు నీ వల్లభు నకనంగ-నడిసంద్రమిల్లు నీ నాధునకనె,

        నాట్యంబు సేయు నీ నాయకుండన -హంగు కావింషు నీ కాంతుడనియె 

గీ||ముష్టికెక్కడికే కేగె నీ యిష్టుడనిన 

     బలి మఖంబున కేగెనో లలన!యనియె,

     ఇట్టులన్యోన్య మర్మంబులెంచుకొనెడి 

     పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతు .

లక్ష్మి::1..పార్వతీ !నీ భర్త కావడితో నీళ్ళు మోసేవాడే!(గంగనుదాల్చినవాడే)

పార్వతి :నీ భర్త నానా వేషాలు వేసే నటుడు (అనేకావతారాలెత్తినవాడు )

లక్ష్మి:2.నీ ప్రియుడు నందినెక్కి (ముసలి ఎద్దునెక్కి)తిరుగును.

పార్వతి::నీ భర్త గ్రద్దనెక్కి తిరుగుట లేదా!

లక్ష్మి:3.నీ :ప్రియునికి శ్మశానమెయిల్లు 

పార్వతి:అవును.నీ నాధుని యిల్లు నడిసముద్రమేగదా!

లక్ష్మి:4.అడుక్కోవటానికి నీ మగడెక్కడికివెళ్ళాడో ?

పార్వతి:మూడడుగుల స్ధలం కోసం అడుక్కోడానికి బలి యజ్ణ భూమికివెళ్ళాడు.

(మొత్తమ్మీద దేవ దేవేరులకు కూడా తప్పలేదు.ఈ ఎత్తిపొడుపులు)