23, జూన్ 2017, శుక్రవారం
17, జూన్ 2017, శనివారం
యాత్ర ---షట్ సుబ్రహ్మణ్య సహిత ద్వాదశ జ్యోతిర్లింగ,శక్తిపీఠదర్శనములు
యాత్ర
21-5-12 నుండి 24-6-12 వరకు
ఈ యాత్ర కొంతమంది దాతల ప్రోత్సాహముతో,యనమండ్ర మల్లేశ్వరశాస్త్రి గారి ఆధ్వర్యమున రాష్ట్రీయ సువిధ సేవాసమితి ద్వారా చేయబడింది.శ్రీ వి.శ్యావాశ్వమహర్షి,శ్రీ సి.హెచ్.రత్నాకర శర్మ,శ్రీకే.రామకృష్ణశర్మ,పి.గణపతిశర్మ,శ్రీఎస్.భావనారాయణశర్మ,వై.ఫణికాంత శర్మ,ఉమాకాంతశర్మ,వై.శ్రీకాంత్ శ ర్మ,శ్రీఎల్.మురళీ మోహనశర్మ,శ్రీఎం.సుబ్రహ్మణ్యశర్మ ,శ్రీ సి.హెచ్.శ్రీనివాసశర్మ,శ్రీ టి.కిశోర్ శర్మ,శ్రీ కె.ఆదిత్య శర్మ,శ్రీ సి.హెచ్.శ్రీకర్ శర్మ,శ్రీ వి.భరద్వాజ శర్మ,శ్రీ కె.ఉదయ్ శర్మ,ఈ ఋత్విక్కులు పాల్గొనిరి.వీరు అభిషేకార్చనలలో అన్ని యాత్రా ప్రదేశాలలో పాల్గొని యాత్రను విజయవంతము చేసిరి.
యాత్రికులు,దాతల పేర్లు దిగువన ఇవ్వబడినవి..
1.శ్రీ సి.హెచ్.సుబ్రహ్మణ్య శర్మ2.శ్రీమతి సి.హెచ్.అన్నపూర్ణ ౩.శ్రీ ఎస్.భాస్కర్ 4.శ్రీమతి ఎస్.విజయ 5.శ్రీ ఎస్.రవికుమార్6.శ్రీమతి ఎస్.కన్యాకుమారి 7.శ్రీమతి ఆర్.విజయలక్ష్మి 8.శ్రీమతి జి.జయప్రద 9.శ్రీ టి.త్యాగారాజశర్మ 10.శ్రీమతి టి.అరుణ 11.శ్రీ జి.లక్ష్మీ నారాయణ శర్మ 12.శ్రీమతి జి.రాధ 13.శ్రీ టి.వి.ప్రసాదరావు 14.శ్రీమతి టి.అన్నపూర్ణ 15శ్రీమతి ఆర్.సీతామహాలక్ష్మి 16.శ్రీ కే.శివ శంకరరావు 17.శ్రీమతికె.సత్యవతి 18.శ్రీమతి ఎం.సూర్యమణి 19.శ్రీమతి.వై .వి.మహాలక్ష్మి 20.శ్రీమతి వై.సువర్చల 21.శ్రీమతి ఎస్.బాలామనోజ్ణ 22.చి||ఎస్.విద్యాచరణ్ 23.శ్రీమతికె.శ్రీదేవి 24.శ్రీమతి వి.రాజేశ్వరి 25.శ్రీమతి వై.నీహారిక 26.శ్రీమతి వై.సత్య27.కుమారి వై.మృణాళిని28.కుమారి కె.కిరణ్మయి 29.కుమారి ఎస్.శ్రీకరి 30.చి||కె.గణపతిశర్మ 31.శ్రీమతిటి.సత్యవాణి 32.శ్రీమతి సిహెచ్.లలితమ్మ 33.శ్రీ ఏం.సోమేశ్వరరావు 34.శ్రీ డి.మురళి 35.శ్రీమతి.ఎం.నాగమణి 36.శ్రీమతి బి.నాగకుమారి 37.శ్రీమతి వి.హరీప్రియ 38.శ్రీమతి సి.హెచ్.జయలక్ష్మి 39.శ్రీ సిహెచ్.త్రినాధకుమార్ 40.శ్రీమతి సిహెచ్.జ్యోత్స్న
వైదికసహాయకులు -శ్రీ ఎం.కె.ప్రసాద శర్మ,శ్రీ కె.సూర్యప్రకాష్
అల్లరి పిడుగులు -మైత్రేయీ,ఈశ,ఐతరేయమహర్షి
పాకశాస్త్ర ప్రవీణులు-శ్రీ యు.వెంకటరమణ ,శ్రీ సి.రమణ,శ్రీ కె.రామమోహన్,శ్రీ సి.యోగి ,శ్రీ సి.హర్ష
ఉపయోగించిన వాహనములు-మార్నింగ్ స్టార్,శాంభవి (A.C)సరికొత్తబస్సులు.-వానిని నడిపినవారు భాషా,మస్తాన్ రెడ్డి,శ్రీనివాస్,వాసు వెంకటేష్
పై మేమందరము 21-5-2012నవిజయవాడలోకలిసి రాష్ట్రీయ సువిధ సేవాసమితి కార్యాలయమునుండి యాత్ర శ్రీ ఏం.రఘునాధ్ గారిచే (శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థాన కార్యనిర్వాహణాధికారి)ప్రారంభింపజేసి రాత్రి 11-15ని||లకు బయలుదేరి గుంటూరు,వినుకొండ మీదుగా పయనించి 22-5-12 తేదీ ఉదయము 7గంటలకు జేరిభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను సేవించి అదే రోజు రాత్రి 7గంటలకు బయలుదేరితిమి.దోనాల,ఆత్మకూరు,కర్నూలుమీదుగా ప్రయాణించి 23తేదీ ఉదయము అలంపురాక్షేత్రమునకు వచ్చితిమి.అక్కడశ్రీజోగులాంబసమేతబాలబ్రహ్మేంద్రస్వామివార్లనుసేవించి మార్గమధ్యములో.(ఓర్వగల్లు) బుగ్గారామేశ్వరస్వామివారినిమరియు(కాల్వబుగ్గ)సంగమేశ్వరస్వామిని దర్శించితిమి.రాత్రి 7 గంటలకు బయలుదేరి 24-5-12 తేదిఉదయము 10 గంటలకు శ్రీ కాళహస్తి చేరి కలహాస్తీశ్వరునిదర్శించితిరుత్తణివెళ్ళిసుబ్రహ్మబ్రహ్మణ్యేశ్వరునిదర్శించిరేణుగుంట మీదుగా కంచిచేరివిష్ణుకంచిలోకంచికామకోటి పీఠాధిపతులవారిధర్మసత్రంలో బస చేసి మరునాడు శివకంచి కామాక్షీదేవి,ఏకాంబరేశ్వర స్వామీ,కామకోటి పీఠాథిపతులవారి దర్శనము అరుణాచాలక్షేత్రమువచ్చి 25 న అక్కడనుండి రాత్రి బయలుదేరి తిమి.
క్రిందివిధముగా మా ప్రయాణము సాగినది.
తేదీ చూచిన ప్రదేశములు
26 -5-12 ----చిదంబరంలో నటరాజస్వామి,వైదీశ్వరంలో అంగారకస్వామి,వైదీశ్వరస్వామి,స్వామిమలైలో సుబ్రహ్మణ్య స్వాముదర్శనం,తంజావూరు క్షేత్రంలో బృహదీశ్వరా స్వామి వారి దర్శనం
27-5-12 ---రామేశ్వరం లో పర్వత వర్ధినీ సమేత రామనాధ స్వామివారి దర్శనం ధనుష్కోటి నవపాషాణ దర్శనం
28-5-12 ----తిరుచ్చoదూరు,త్రిపురగుండం,అలగారుకోయల్ క్షేత్రాలలో సుబ్రహ్మణ్య స్వామి వార్లను 29-5-12 చూచిపళనిచేరి,సుబ్రహ్మణ్యస్వామి వారిని దర్శించి శ్రీ రంగం లోరంగనాధుని దర్శించి జంబుకేశ్వరం లో నుండి రాత్రి పది గంటలకుబయలుదేరిచాముండేశ్వరి కొండ,మదనపల్లి,సంగారెడ్డి శంకరంపేట,షోలాపూర్ మీదుగా
1-6-12 న కొల్హాపూర్ చేరితిమి. భీమేశ్వర స్వామిని చూచితిమి
2-6-12 కొల్హాపూర్ నుండి భీమశంకరం వచ్చి త్య్రంబ కేశ్వరస్వామినిద ర్శించి
3-6-12 నత్య్రంబక క్షేత్రములో ఘృష్మేశ్వర క్షేత్రంలో . ఘృష్మేశ్వర స్వామినిదర్శించి ఎల్లోరాగుహలకు వెళ్ళి చూచి సోమనాధ్ కి బయలుదేరితిమి. 5-6-12న సోమనాధ్ చేరిసోమనాధుని దర్శించి . హరిణా,కపిలా,సరస్వతీ నదుల సంగమం చూసి,నాగనాధ్ వెళ్లితిమి.
6-6-12 -సోమనాధుని దర్శించి గోమతిద్వారకలో ,భేటీ ద్వారకలో కృష్ణుని ఛోటిల్లా క్షేత్రమునకువెళ్ళితిమి.
7-6-12 -చండీ,చాముండీఅమ్మవార్లను దర్శించి ధాకోర్ క్షేత్రములో కృష్ణుని చూచితిమి.అక్కడ నుండి
8-6-12 -ఓంకార్ క్షేత్రంచేరి ఓంకారేశ్వరస్వామినిదర్శించి అమలేశ్వరస్వామిని దర్శించిఉజ్జయినికి బయలుదేరి
9-6-12 నమహాకాళేశ్వరస్వామి ,మహాకాళీ,హరసిధ్ధిమాత, కాలభైరవస్వామి, సాందీపని ఆశ్రమము,విశ్వామిత్రుని గుహలు,నాగచండీశ్వరదర్శనము కలిగినవి.అట నుండి హరిద్వార్ నకు ప్రయాణించి
11-6-12 నకుచేరిమానసాదేవి,చండీదేవి,మాయాదేవి,దక్షయజ్ఞం ల దర్శనములైనవి ,అక్కడనుండి కేదారనాధ్ నకు ప్రయాణమైరాంపురం మీదుగా
13-6-12నకేదార నాధ్ చేరి కేదారేశ్వర స్వామిని దర్శించి బదరీనాధ్ క్షేత్రమునకుబయలుదేరితిమి.
14-06-12 రాత్రి బయలుదేరి 15-06-12 ఉదయము బడరినాద్ చేరిబదరీనాధునిదర్శించి అచటనే ఉన్న బ్రహ్మకపాలమున పితృ తర్పణము జేసి ఆ రోజు రాత్రి బయలు దేరితిమి.
15-06-12 న హరిద్వార్ చేరి 16-06-12 న రాత్రిబయలుదేరి 17-06-12 నైమిశారణ్యము గుండా
18-06-12 న అయోధ్య చేరితిమి.రాములవారి దర్శనము చేసుకొని బయలుదేరి అల్హాబాదునకు చేరి మాధవేశ్వరస్వామిని దర్శించి వారణాసికి బయలుదేరితిమి.
19 -06-12 కాశీ చేరి విశ్వేశ్వరుని దర్శించి గయకు బయలుదేరి
20 -06-12 న చేరి మంగళగౌరి,విష్ణుపాదము,వట వృక్షం లనుదర్శించి పితృ తర్పణములనొనర్చి వైద్యనాద్ బయలుదేరితిమి.
21-06-12 న వైద్యనాధుని దర్శించి జాజిపూర్ నకు బయలు దేరితిమి.
22-06-12 న రాతికి చేరి గిరిజాదేవి దర్శనము జేసుకొని అరసవిల్లికి బయలుదేరి
23-06-12 న చేరి సూర్యనారాయణ దర్శనముజేసుకొని శ్రీ కూర్మము వెళ్లికూర్మావతార దర్శనము చేసుకొని సింహాచలము వెళ్లి నృసింహ స్వామిని దర్శించి
24-06-12 న పిఠాపురంవచ్చి కుక్కటేశ్వరస్వామిని దర్శించి ద్రాక్షారము జేరి భీమేశ్వర స్వామిని సేవించి కోటిపల్లి రేవులో అవబృధ స్నానముచేసి రాత్రి 10 గంటలకు విజయవాడకు బయలు దేరితిమి.ఈవిధముగా మా యాత్ర సమాప్తమయినది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)